బయోపిక్ ల హవా నడుస్తున్న రోజులివి. వాటికి లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో స్ఫూర్తివంతమైన పలువురి జీవితాల్ని సినిమాలు తీస్తున్నారు. ఇలాంటివేళ.. కాఫీ కింగ్ గా పేరున్న ప్రముఖ వ్యాపారవేత్త అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవటం.. ఆయన డెడ్ బాడీ నదిలో బయటపడటం లాంటి సంచలన ఉదంతాలతో దేశ వ్యాప్తంగా చర్చగా మారిన వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ జీవితాన్ని రీల్ గా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు బరిలోకి దిగాయి.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్.. ప్రసేన్ జిత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీయనున్నారు. ఈ మూవీ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. తాజాగా ఈ సినిమా నిర్మాణంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. టీ సిరీస్.. ఆల్మైటీ మోషన్ పిక్చర్ తో పాటు కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నాయి.
భారతదేశంలో కాఫీని ప్రజల జీవితాల్లో భాగం చేయటమే కాదు.. కాఫీకి సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టటంలో వీజీ సిద్ధార్థ కీలక భూమిక పోషించారు. కాఫీ డే పేరుతో కొత్త తరహా వ్యాపార అవకాశాల్ని చూపించిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయన 59 ఏళ్ల వయసులో అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవటం.. ఆయన డెడ్ బాడీ కర్ణాటకలోని ఒక నదిలో దొరకడం లాంటి నాటకీయ పరిణామాలెన్నో. అయితే.. ఈ మూవీలో సిద్ధార్థ పాత్రను ఎవరు పోషించనున్నారన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఏమైనా.. కాఫీ కింగ్ లైఫ్ మూవీగా ఆసక్తికరంగా మారుతుందని చెప్పక తప్పదు.
This post was last modified on June 18, 2022 9:52 am
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…