Movie News

అప్పట్లో ఓ దర్శకుడుండేవాడు.. అతణ్ని పిలుస్తున్నారట

ఈ ఏడాది మలయాళంలోనే కాదు.. సౌత్ ఇండియలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుం కోషీయుం’. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజు మీనన్ కాంబినేషన్లో దర్శకుడు సాచీ రూపొందించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత వంశీ సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి ప్రధాన పాత్రల కోసం, అలాగే దర్శకుడి కోసం వేట సాగుతోంది. నటుల వేట ఒక దశ దాటాక కొలిక్కి వచ్చి రవితేజ, రానా దగ్గుబాటి ఖరారైనట్లు తెలిసింది. ఐతే దర్శకుడి సంగతి తేలడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ముందు సుధీర్ వర్మ పేరు వినిపించింది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవ్వరూ ఖరారవ్వలేదు.

తాజా సమచారం ప్రకారం.. ఇప్పుడు యువ దర్శకుడు సాగర్ చంద్రను సంప్రదిస్తున్నారట. ‘అయ్యారే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్.. నాలుగేళ్ల కిందట చివరగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే మంచి సినిమా తీశాడు. అది అప్పట్లో చర్చనీయాంశమైంది. శ్రీ విష్ణు లాంటి చిన్న హీరో నటించడం వల్ల కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. ఒక స్టార్ నటించి ఉంటే పెద్ద రేంజికి వెళ్లేదీ చిత్రం అనడంలో సందేహం లేదు. అంత మంచి సినిమా తీసినా.. ఇప్పటిదాకా మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు సాగర్.

వరుణ్ తేజ్‌తో ఓ సినిమా కోసం ప్రయత్నించాడు కానీ వర్కవుట్ కాలేదు. అతణ్ని ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ కోసం అడుగుతున్నారట. అన్నీ కుదిరితే అతనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశముంది. ఇద్దరు రచయితలతో స్క్రిప్టు రెడీ చేశారని.. సాగర్ దర్శకుడు ఖరారైతే ఆగస్టులో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారని సమాచారం.

This post was last modified on June 28, 2020 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

46 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago