Movie News

అప్పట్లో ఓ దర్శకుడుండేవాడు.. అతణ్ని పిలుస్తున్నారట

ఈ ఏడాది మలయాళంలోనే కాదు.. సౌత్ ఇండియలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుం కోషీయుం’. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజు మీనన్ కాంబినేషన్లో దర్శకుడు సాచీ రూపొందించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత వంశీ సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి ప్రధాన పాత్రల కోసం, అలాగే దర్శకుడి కోసం వేట సాగుతోంది. నటుల వేట ఒక దశ దాటాక కొలిక్కి వచ్చి రవితేజ, రానా దగ్గుబాటి ఖరారైనట్లు తెలిసింది. ఐతే దర్శకుడి సంగతి తేలడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ముందు సుధీర్ వర్మ పేరు వినిపించింది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవ్వరూ ఖరారవ్వలేదు.

తాజా సమచారం ప్రకారం.. ఇప్పుడు యువ దర్శకుడు సాగర్ చంద్రను సంప్రదిస్తున్నారట. ‘అయ్యారే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్.. నాలుగేళ్ల కిందట చివరగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే మంచి సినిమా తీశాడు. అది అప్పట్లో చర్చనీయాంశమైంది. శ్రీ విష్ణు లాంటి చిన్న హీరో నటించడం వల్ల కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. ఒక స్టార్ నటించి ఉంటే పెద్ద రేంజికి వెళ్లేదీ చిత్రం అనడంలో సందేహం లేదు. అంత మంచి సినిమా తీసినా.. ఇప్పటిదాకా మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు సాగర్.

వరుణ్ తేజ్‌తో ఓ సినిమా కోసం ప్రయత్నించాడు కానీ వర్కవుట్ కాలేదు. అతణ్ని ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ కోసం అడుగుతున్నారట. అన్నీ కుదిరితే అతనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశముంది. ఇద్దరు రచయితలతో స్క్రిప్టు రెడీ చేశారని.. సాగర్ దర్శకుడు ఖరారైతే ఆగస్టులో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారని సమాచారం.

This post was last modified on June 28, 2020 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

1 hour ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

2 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

4 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

4 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

6 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

7 hours ago