ఖిలాడీ తర్వాత విడుదల కావాల్సిన మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఆ మధ్య అఫీషియల్ గా వాయిదా వేసి కొత్త డేట్ ప్రకటిస్తామని చెప్పారు. అనౌన్స్ మెంట్ వచ్చి నెలవుతోంది. లేదంటే ఇవాళ విరాటపర్వం స్థానంలో ఈ మూవీ ఉండేది. సరే పోస్ట్ పోన్లు కరోనా వచ్చి పోయినప్పటి నుంచి సహజమే కదాని అభిమానులు సర్దిచెప్పుకున్నారు. టీజర్ వచ్చి నెలలు దాటుతోంది. కొన్ని పోస్టర్లు వదిలారు. హంగామా బాగానే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా గప్ చుప్. రామారావు ఏ సౌండ్ చేయడం లేదు.
దర్శకుడు శరత్ మండవ కానీ నిర్మాతలు కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రూపొందుతున్న ధమాకా షూటింగ్ పూర్తి కావడానికి దగ్గరగా ఉంది. స్టువర్ట్ పురం దొంగల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగి రవితేజ మోకాలికి పదికి పైగా కుట్లు పడ్డాయట. మరీ సీరియస్ గా కాకపోవడంతో వీలైనంత త్వరలోనే రీ స్టార్ట్ చేయబోతున్నట్టు యూనిట్ అప్ డేట్.
ఇవయ్యాక రావణాసుర ఉంటుంది. దీనికన్నా ముందు మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న వాల్తేర్ వీరయ్యని ఫినిష్ చేయాలి. వీటి గురించి ఇంత అలెర్ట్ గా అప్ టు డేట్ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మాత్రం చప్పుడు చేయకపోవడం విచిత్రం. ఏవో ఆర్థిక లావాదేవీల కారణంగా ఇంకో పాట బ్యాలన్స్ ఉండగానే ఆపేశారని, తిరిగి మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారో తెలియదని ఆఫ్ ది రికార్డు టాక్. రవితేజ వరస సినిమాలు వస్తున్నాయని ఆనందపడుతున్న టైంలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు
This post was last modified on June 17, 2022 6:13 pm
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…