ఖిలాడీ తర్వాత విడుదల కావాల్సిన మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఆ మధ్య అఫీషియల్ గా వాయిదా వేసి కొత్త డేట్ ప్రకటిస్తామని చెప్పారు. అనౌన్స్ మెంట్ వచ్చి నెలవుతోంది. లేదంటే ఇవాళ విరాటపర్వం స్థానంలో ఈ మూవీ ఉండేది. సరే పోస్ట్ పోన్లు కరోనా వచ్చి పోయినప్పటి నుంచి సహజమే కదాని అభిమానులు సర్దిచెప్పుకున్నారు. టీజర్ వచ్చి నెలలు దాటుతోంది. కొన్ని పోస్టర్లు వదిలారు. హంగామా బాగానే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా గప్ చుప్. రామారావు ఏ సౌండ్ చేయడం లేదు.
దర్శకుడు శరత్ మండవ కానీ నిర్మాతలు కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రూపొందుతున్న ధమాకా షూటింగ్ పూర్తి కావడానికి దగ్గరగా ఉంది. స్టువర్ట్ పురం దొంగల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగి రవితేజ మోకాలికి పదికి పైగా కుట్లు పడ్డాయట. మరీ సీరియస్ గా కాకపోవడంతో వీలైనంత త్వరలోనే రీ స్టార్ట్ చేయబోతున్నట్టు యూనిట్ అప్ డేట్.
ఇవయ్యాక రావణాసుర ఉంటుంది. దీనికన్నా ముందు మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న వాల్తేర్ వీరయ్యని ఫినిష్ చేయాలి. వీటి గురించి ఇంత అలెర్ట్ గా అప్ టు డేట్ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మాత్రం చప్పుడు చేయకపోవడం విచిత్రం. ఏవో ఆర్థిక లావాదేవీల కారణంగా ఇంకో పాట బ్యాలన్స్ ఉండగానే ఆపేశారని, తిరిగి మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారో తెలియదని ఆఫ్ ది రికార్డు టాక్. రవితేజ వరస సినిమాలు వస్తున్నాయని ఆనందపడుతున్న టైంలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు
This post was last modified on June 17, 2022 6:13 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…