ఖిలాడీ తర్వాత విడుదల కావాల్సిన మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఆ మధ్య అఫీషియల్ గా వాయిదా వేసి కొత్త డేట్ ప్రకటిస్తామని చెప్పారు. అనౌన్స్ మెంట్ వచ్చి నెలవుతోంది. లేదంటే ఇవాళ విరాటపర్వం స్థానంలో ఈ మూవీ ఉండేది. సరే పోస్ట్ పోన్లు కరోనా వచ్చి పోయినప్పటి నుంచి సహజమే కదాని అభిమానులు సర్దిచెప్పుకున్నారు. టీజర్ వచ్చి నెలలు దాటుతోంది. కొన్ని పోస్టర్లు వదిలారు. హంగామా బాగానే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా గప్ చుప్. రామారావు ఏ సౌండ్ చేయడం లేదు.
దర్శకుడు శరత్ మండవ కానీ నిర్మాతలు కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రూపొందుతున్న ధమాకా షూటింగ్ పూర్తి కావడానికి దగ్గరగా ఉంది. స్టువర్ట్ పురం దొంగల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగి రవితేజ మోకాలికి పదికి పైగా కుట్లు పడ్డాయట. మరీ సీరియస్ గా కాకపోవడంతో వీలైనంత త్వరలోనే రీ స్టార్ట్ చేయబోతున్నట్టు యూనిట్ అప్ డేట్.
ఇవయ్యాక రావణాసుర ఉంటుంది. దీనికన్నా ముందు మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న వాల్తేర్ వీరయ్యని ఫినిష్ చేయాలి. వీటి గురించి ఇంత అలెర్ట్ గా అప్ టు డేట్ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మాత్రం చప్పుడు చేయకపోవడం విచిత్రం. ఏవో ఆర్థిక లావాదేవీల కారణంగా ఇంకో పాట బ్యాలన్స్ ఉండగానే ఆపేశారని, తిరిగి మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారో తెలియదని ఆఫ్ ది రికార్డు టాక్. రవితేజ వరస సినిమాలు వస్తున్నాయని ఆనందపడుతున్న టైంలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు
This post was last modified on June 17, 2022 6:13 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…