‘బాహుబలి’ తర్వాత ఆకాశాన్నంటే అంచనాలను ప్రభాస్ అందుకోలేకపోయాడు. తన తర్వాతి చిత్రాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్’లతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ‘సాహో’ అయినా యాక్షన్ ఘట్టాలతో, కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది, ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది కానీ.. ‘రాధేశ్యామ్’ అయితే అన్ని రకాలుగా నిరాశ పరిచింది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డల్లయిపోయారు. అతడి తర్వాతి చిత్రాల మీద వాళ్లు భారీ ఆశలతో ఉన్నారు. ప్రభాస్ నుంచి సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాలకు తోడుగా.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ ఎంటర్టైనర్ చేయబోతున్న విషయం విదితమే. ఐతే చిన్న-మీడియం రేంజిలో మామూలు ఎంటర్టైనర్లు తీసే మారుతి.. ప్రభాస్ ఇమేజ్కు తగ్గ భారీ సినిమా తీయగలడా అన్న సందేహాలున్నాయి.
అసలు మారుతి ప్రభాస్తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు.. జానర్ ఏంటి.. వీరి కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు. ఐతే పూర్తి వివరాలు చెప్పలేదు కానీ.. తన కొత్త చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడు మారుతి. ప్రభాస్కు తాను పెద్ద అభిమానినని.. ఒక అభిమానిగా ప్రభాస్ నుంచి అందరూ ఏం ఆశిస్తారో తనకు తెలుసని మారుతి వ్యాఖ్యానించాడు.
ప్రభాస్తో బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి ఎంటర్టైనర్ తీయాలన్నది తన ఉద్దేశమని.. అలాంటి కథతోనే ప్రభాస్ను అప్రోచ్ అయ్యానని.. ఇంతకుమించి ఇప్పుడే ఆ సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడలేనని ప్రభాస్ స్పష్టం చేశాడు. ఏదైనా సరే.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని, ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని మాత్రం మారుతి సంకేతాలిచ్చాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on June 17, 2022 2:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…