Prabhas
‘బాహుబలి’ తర్వాత ఆకాశాన్నంటే అంచనాలను ప్రభాస్ అందుకోలేకపోయాడు. తన తర్వాతి చిత్రాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్’లతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ‘సాహో’ అయినా యాక్షన్ ఘట్టాలతో, కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది, ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది కానీ.. ‘రాధేశ్యామ్’ అయితే అన్ని రకాలుగా నిరాశ పరిచింది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డల్లయిపోయారు. అతడి తర్వాతి చిత్రాల మీద వాళ్లు భారీ ఆశలతో ఉన్నారు. ప్రభాస్ నుంచి సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాలకు తోడుగా.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ ఎంటర్టైనర్ చేయబోతున్న విషయం విదితమే. ఐతే చిన్న-మీడియం రేంజిలో మామూలు ఎంటర్టైనర్లు తీసే మారుతి.. ప్రభాస్ ఇమేజ్కు తగ్గ భారీ సినిమా తీయగలడా అన్న సందేహాలున్నాయి.
అసలు మారుతి ప్రభాస్తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు.. జానర్ ఏంటి.. వీరి కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు. ఐతే పూర్తి వివరాలు చెప్పలేదు కానీ.. తన కొత్త చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడు మారుతి. ప్రభాస్కు తాను పెద్ద అభిమానినని.. ఒక అభిమానిగా ప్రభాస్ నుంచి అందరూ ఏం ఆశిస్తారో తనకు తెలుసని మారుతి వ్యాఖ్యానించాడు.
ప్రభాస్తో బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి ఎంటర్టైనర్ తీయాలన్నది తన ఉద్దేశమని.. అలాంటి కథతోనే ప్రభాస్ను అప్రోచ్ అయ్యానని.. ఇంతకుమించి ఇప్పుడే ఆ సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడలేనని ప్రభాస్ స్పష్టం చేశాడు. ఏదైనా సరే.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని, ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని మాత్రం మారుతి సంకేతాలిచ్చాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on June 17, 2022 2:16 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…