హ్యాపీడేస్ సినిమాతో పుష్కరం కిందటే రూ.30 కోట్ల షేర్ రాబట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల. మూడేళ్ల కిందట వచ్చిన అతడి సినిమా ఫిదా రూ.50 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. తీసేవి క్లాస్ సినిమాలే అయినా.. మాస్ సినిమాలకు దీటుగా వసూళ్ల తెప్పించగల సత్తా శేఖర్ సొంతం. అయితే ఇంత స్టామినా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పెద్ద స్టార్లు ఎవ్వరితోనూ సినిమాలు తీయలేదు.
స్టార్లను డైరెక్ట్ చేయగల సత్తా ఉందని చెప్పడమే తప్ప.. వాళ్లతో సినిమాలు మాత్రం సెట్ చేసుకోలేకపోయాడు శేఖర్. ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా కోసం శేఖర్ ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. కానీ దాని సంగతేమైందో తెలియదు. ఐతే ఎట్టకేలకు శేఖర్.. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్.
ఫిదా తర్వాత కమ్ముల కొంచెం గ్యాప్ తీసుకుని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ పాటికి ఆచిత్రం విడుదలకు సిద్ధమయ్యేది. ఈ ప్రభావం వల్ల ఆ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇంకా కొంత చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ టైంను వృథా చేయకుండా తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడట కమ్ముల. అది వెంకీతోనే అని సమాచారం. లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్తో కలిసి పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రానుందని.. వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on June 27, 2020 11:33 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…