హ్యాపీడేస్ సినిమాతో పుష్కరం కిందటే రూ.30 కోట్ల షేర్ రాబట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల. మూడేళ్ల కిందట వచ్చిన అతడి సినిమా ఫిదా రూ.50 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. తీసేవి క్లాస్ సినిమాలే అయినా.. మాస్ సినిమాలకు దీటుగా వసూళ్ల తెప్పించగల సత్తా శేఖర్ సొంతం. అయితే ఇంత స్టామినా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పెద్ద స్టార్లు ఎవ్వరితోనూ సినిమాలు తీయలేదు.
స్టార్లను డైరెక్ట్ చేయగల సత్తా ఉందని చెప్పడమే తప్ప.. వాళ్లతో సినిమాలు మాత్రం సెట్ చేసుకోలేకపోయాడు శేఖర్. ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా కోసం శేఖర్ ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. కానీ దాని సంగతేమైందో తెలియదు. ఐతే ఎట్టకేలకు శేఖర్.. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్.
ఫిదా తర్వాత కమ్ముల కొంచెం గ్యాప్ తీసుకుని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ పాటికి ఆచిత్రం విడుదలకు సిద్ధమయ్యేది. ఈ ప్రభావం వల్ల ఆ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇంకా కొంత చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ టైంను వృథా చేయకుండా తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడట కమ్ముల. అది వెంకీతోనే అని సమాచారం. లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్తో కలిసి పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రానుందని.. వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on June 27, 2020 11:33 pm
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…