హ్యాపీడేస్ సినిమాతో పుష్కరం కిందటే రూ.30 కోట్ల షేర్ రాబట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల. మూడేళ్ల కిందట వచ్చిన అతడి సినిమా ఫిదా రూ.50 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. తీసేవి క్లాస్ సినిమాలే అయినా.. మాస్ సినిమాలకు దీటుగా వసూళ్ల తెప్పించగల సత్తా శేఖర్ సొంతం. అయితే ఇంత స్టామినా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పెద్ద స్టార్లు ఎవ్వరితోనూ సినిమాలు తీయలేదు.
స్టార్లను డైరెక్ట్ చేయగల సత్తా ఉందని చెప్పడమే తప్ప.. వాళ్లతో సినిమాలు మాత్రం సెట్ చేసుకోలేకపోయాడు శేఖర్. ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా కోసం శేఖర్ ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. కానీ దాని సంగతేమైందో తెలియదు. ఐతే ఎట్టకేలకు శేఖర్.. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్.
ఫిదా తర్వాత కమ్ముల కొంచెం గ్యాప్ తీసుకుని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ పాటికి ఆచిత్రం విడుదలకు సిద్ధమయ్యేది. ఈ ప్రభావం వల్ల ఆ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇంకా కొంత చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ టైంను వృథా చేయకుండా తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడట కమ్ముల. అది వెంకీతోనే అని సమాచారం. లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్తో కలిసి పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రానుందని.. వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కుతుందని అంటున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…