హ్యాపీడేస్ సినిమాతో పుష్కరం కిందటే రూ.30 కోట్ల షేర్ రాబట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల. మూడేళ్ల కిందట వచ్చిన అతడి సినిమా ఫిదా రూ.50 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. తీసేవి క్లాస్ సినిమాలే అయినా.. మాస్ సినిమాలకు దీటుగా వసూళ్ల తెప్పించగల సత్తా శేఖర్ సొంతం. అయితే ఇంత స్టామినా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పెద్ద స్టార్లు ఎవ్వరితోనూ సినిమాలు తీయలేదు.
స్టార్లను డైరెక్ట్ చేయగల సత్తా ఉందని చెప్పడమే తప్ప.. వాళ్లతో సినిమాలు మాత్రం సెట్ చేసుకోలేకపోయాడు శేఖర్. ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా కోసం శేఖర్ ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. కానీ దాని సంగతేమైందో తెలియదు. ఐతే ఎట్టకేలకు శేఖర్.. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్.
ఫిదా తర్వాత కమ్ముల కొంచెం గ్యాప్ తీసుకుని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ పాటికి ఆచిత్రం విడుదలకు సిద్ధమయ్యేది. ఈ ప్రభావం వల్ల ఆ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇంకా కొంత చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ టైంను వృథా చేయకుండా తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడట కమ్ముల. అది వెంకీతోనే అని సమాచారం. లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్తో కలిసి పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రానుందని.. వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on June 27, 2020 11:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…