టాలీవుడ్లో హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ విషయానికి వస్తే.. చిరు-బాలయ్యల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరు దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా ఆధిపత్యం చలాయించగా.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చిన టాప్ స్టార్లలో బాలయ్య ఒకడు. వీళ్లిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలిస్తే ప్రేక్షకుల మధ్య విపరీతమైన ఆసక్తి ఉండేది.
ఐతే బేసిగ్గా బాలయ్యతో పోలిస్తే చిరు బాక్సాఫీస్ రేంజ్ చాలా ఎక్కువే కానీ.. ఇద్దరూ తలపడ్డ సమయాల్లో బాలయ్య నుంచి పోటీ గట్టిగానే ఉండేది. ‘మృగరాజు’ సినిమా మీద ‘నరసింహనాయుడు’ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు చూడటానికి చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.
పదేళ్లకు పైగా సినిమాల నుంచి విరామం తీసుకుని, ‘ఖైదీ నంబర్ 150’తో చిరు రీఎంట్రీ ఇచ్చినపుడు.. బాలయ్య ఆయనతో పోటీకి సై అన్నాడు. 2017 సంక్రాంతికి చిరు చిత్రంతో బాలయ్య మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తలపడింది. అప్పుడు రెండు చిత్రాలూ బాగా ఆడాయి. ఐతే టాక్ బాలయ్య సినిమాకే బాగా రాగా.. ఓవరాల్ వసూళ్లలో చిరు చిత్రం పైచేయి సాధించింది. ఆ తర్వాత మళ్లీ చిరు-బాలయ్య బాక్సాఫీస్ పోరు కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
అఖండ, ఆచార్య మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు కానీ.. అది జరగలేదు. కానీ ఈ ఏడాది ఈ సీనియర్ హీరోలు మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టడం ఖాయం అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త చిత్రాన్ని దసరాకు షెడ్యూల్ చేశారు. దానికి పోటీగా చిరు కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ రావచ్చని తెలుస్తోంది.
ముందు ఈ సినిమాను ఆగస్టుకే అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆలోచన మారిందట. పండుగ టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారట. ‘ఆచార్య’తో చిరు ఢీలా పడిపోగా.. బాలయ్య ‘అఖండ’తో ఊపుమీదున్నారు. హైప్ పరంగా చూస్తే ఇప్పుడు బాలయ్య సినిమాకే కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. మరి చిరు ‘గాడ్ ఫాదర్’తో తిరిగి సత్తా చాటి బాలయ్య మీద పైచేయి సాధిస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on June 16, 2022 10:18 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…