రాను రాను ప్రతి శుక్రవారం ఓటిటిలోనూ విపరీతమైన పోటీ నెలకొంటోంది. ఆప్షన్లు ఎక్కువైపోయి ప్రేక్షకులు ఏది ముందు చూడాలో అర్థం కానీ కన్ఫ్యూజన్ కు లోనవుతున్నారు. ఒకపక్క సినిమాలు మరోపక్క వెబ్ సిరీస్ లు పోటీపడి మరీ పలకరిస్తున్నాయి. థియేటర్ రిలీజ్ ఫ్రైడే అంటే వీకెండ్ లెక్కలు గట్రా ఉంటాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు.
ఇప్పుడీ సెంటిమెంట్ ని డిజిటల్ సంస్థలు కూడా స్ట్రిక్ట్ గా ఫాలో కావడం అనూహ్యం. శనివారం చేసినా లేక బుధగురువారాలో ఎంచుకున్నా ఇబ్బంది లేదు. కానీ అలా చేయడం లేదు. రేపు స్మార్ట్ ఎంటర్ టైన్మెంట్ మాములుగా లేదు. ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే సినిమా రేంజ్ లో అమెజాన్ ప్రైమ్ పబ్లిసిటీ చేసుకున్న వెబ్ సిరీస్ సుడల్ రేపు స్ట్రీమింగ్ కానుంది.
డబ్బింగ్ వెర్షనే అయినప్పటికి తెలుగు రాష్ట్రాల్లోనూ అవుట్ డోర్ హోర్డింగ్స్ తో భారీ పబ్లిసిటీ చేశారు. పెద్ద పేపర్ యాడ్స్ ఇవ్వబోతున్నారు. విక్రమ్ వేదా దర్శకజంట పుష్కర్ గాయత్రిలు రచన చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు టీవీ యాడ్స్ భీభత్సంగా ఇచ్చారు. నయనతార ఓ2 హాట్ స్టార్ లో వస్తోంది. ఇది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ మూవీ. ట్రైలర్ ఆసక్తి రేపింది.
తెలుగులో స్ట్రెయిట్ గా వస్తున్న మరో జీ5 సిరీస్ రెక్కె. దీనికీ హంగామా బాగానే జరిగింది. ప్రచారంలో కొంచెం వెనుకబడి ఉండే ఈ సంస్థ దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ షీకి రెండు సీజన్ రేపే స్ట్రీమింగ్ కానుంది. డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందిన బాలీవుడ్ మూవీ మాసూమ్ ని హాట్ స్టార్ లో తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా ఇంగ్లీష్, ఫ్రెంచ్ కంటెంట్ చాలానే రాబోతోంది. బయటికి కాలు పెట్టకుండానే ఇంతేసి వినోదం ఇంట్లోకే నేరుగా వస్తున్నా ఏది ఎంచుకోవాలో ఆలోచించేలా గట్టి చిక్కే తెచ్చిపెట్టారు
గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ…
దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన ప్రకారమే తన కొత్త సినిమా షూటింగ్ ఇవాళ మొదలుపెట్టేశారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలయికలో…
ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే…
మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్…
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్లే మల్టీస్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఉదయమే…