ఒక సినిమాతో భారీ సక్సెస్ అందుకొని దానికి పార్ట్ 2 తీస్తూ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉండే ఏ స్టార్ డైరెక్టర్ అయినా మీడియాకి అలాగే పబ్లిక్ కి కాస్త దూరంగా ఉంటూ తన పనిలో నిమగ్నవుతాడు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇందుకు భిన్నంగా ఉంటున్నాడు. అవును సుక్కు ప్రస్తుతం ఇతర సినిమా ప్రమోషన్స్ కి టైం ఇస్తూ వాటి ఫంక్షన్ లో తరచుగా కనిపిస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’, ‘శేఖర్’,’అంటే సుందరానికీ’ ఇలా వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా మారారు సుకుమార్. ఇప్పుడు రానా ‘విరాట పర్వం’ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నాడు.
సర్కారు వారి పాట, అంటే సుందరానికీ మైత్రి సినిమాలు కాబట్టి తన నిర్మాతల కోసం సుక్కు వచ్చాడనుకోవచ్చు. కానీ శేఖర్ , విరాట పర్వం లకు రావడానికి మాత్రం కారణం లేదు. జస్ట్ అప్రోచ్ అవ్వగానే కాదనలేక వచ్చేస్తున్నారు. నిజానికి సుక్కు ఈ మధ్యే ‘పుష్ప 2’ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. స్క్రిప్ట్ కి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆగస్ట్ నుండి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. మరి ఈ సమయంలో ఇలా ఇతర సినిమాల ఈవెంట్లు , వెకేషన్స్ అంటూ ఉన్న టైంని వాటికి వాడుకుంటే ఎలా అంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
రాజమౌళి , త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నారు. సుక్కు మాత్రం పిలిచిన ప్రతీ ఈవెంట్ కి వచ్చేస్తున్నాడు. అలా కాకుండా తను పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అంటూ స్కిప్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్ లో ఎక్కువ కనిపించినా క్రేజ్ ఉండదు. అప్పుడప్పుడూ కనిపిస్తేనే ఇమేజ్ ఉంటుంది. ఇదంతా సుక్కు అనాలసిస్ చేసుకొని ఇకపై పుష్ప సీక్వెల్ పై మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది మరి.
This post was last modified on June 15, 2022 5:13 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…