Movie News

సంక్రాంతిపై బాలయ్య కన్ను ?

టాలీవుడ్ లో కొందరు హీరోలకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ప్రతీ సంక్రాంతికి తన సినిమా రిలీజ్ అవ్వాలని దర్శక , నిర్మాతలపై ఒత్తిడి పెంచుతుంటారు. ఆ లిస్టులో బాలయ్య కూడా ఒకరు. అవును బాలక్రిష్ణ కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఎప్పటి నుండో సంక్రాంతి హీరోగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు నందమూరి నటసింహం. కాకపోతే మూడేళ్ళుగా సంక్రాంతి కి రాలేకపోయాడు. ఇప్పుడు వచ్చే సంక్రాంతిపై బాలయ్య కన్ను పడింది.

అవును అనిల్ రావిపూడితో బాలయ్య చేయబోయే సినిమాను 2022 సంక్రాంతి రిలీజ్ అనుకుంటున్నారు. ఈ మేరకు ప్లానింగ్ కూడా రెడీ అవుతుంది. ఐదారు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది జనవరిలో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఇక తక్కువ డేస్ స్టార్ తో సినిమా చేయడం అనిల్ తెలిసిన విద్యే. మహేష్ బాబు లాంటి స్టార్ ని పెట్టుకొని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను ఐదు నెలల్లోనే కంప్లీట్ చేశాడు. అందుకే ఇప్పుడు బాలయ్య కూడా తమ కాంబో సినిమాను జెట్ స్పీడులో ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలకు చెప్పేశాడని తెలుస్తుంది.

ఈ సినిమాతో బాలయ్య ని అనిల్ సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఫాదర్ , డాటర్ సెంటిమెంట్ తో తన మార్క్ కామెడీ యాడ్ చేసి యాక్షన్ డ్రామాగా సినిమాను తెరకెక్కించనున్నాడు. సినిమాలో బాలయ్య కి కూతురుగా శ్రీలీల కనిపించనుంది. జులై లేదా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పరీశీలనలో ఉంది. త్వరలోనే సినిమాను గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.

This post was last modified on June 15, 2022 5:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

31 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago