గాడ్సె.. ఈ శుక్రవారం రిలీజవుతున్న చిత్రాల్లో ఒకటి. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో రోమియో, బ్లఫ్ మాస్టర్ చిత్రాలు రూపొందించిన గోపీ గణేష్ ఈ సినిమా తీశాడు. సత్యదేవ్ ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్లో నటించిన ఈ చిత్రం.. ప్రస్తుత రాజకీయాల్లో, వ్యవస్థలో కుళ్లును కడిగి పడేసే నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కింది. ట్రైలర్లో డైలాగులు చాలా పవర్ ఫుల్గా కనిపించాయి. కాకపోతే సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి కాస్త ఆలస్యంగా రిలీజవుతుండటంతో ఆశించిన స్థాయిలో బజ్ క్రియేటవ్వలేదు.
‘విరాటపర్వం’ మీద ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా నిలిచి ఉండడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఇలాంటి తరుణంలో గోపీ గణేష్తో ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ కొంచెం వివాదాస్పదంగా మారడం, ఆ ఇంటర్వ్యూ నుంచి గోపీ వాకౌట్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఈ సినిమాలో కొన్ని డైలాగులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ను టార్గెట్ చేసేలా ఉండడం మీద ఇంటర్వ్యూయర్ గోపీ గణేష్ను ప్రశ్నించారు. మీకు కొందరు రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయట నిజమేనా అని అతను అడిగాడు.
దీనికి గోపీ బదులిస్తూ.. తాను సిన్సియర్గా ఒక సినిమా తీశానని.. దీని మీద కాంట్రవర్శీలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. నన్ను బెదిరించినట్లుగా మీకెవరు చెప్పారు.. మీ మాటలు చూస్తుంటే అధికార పార్టీకి అమ్ముడుపోయినట్లుగా అనిపిస్తోంది అని కూడా వ్యాఖ్యానించాడు. దీనికి ఇంటర్వ్యూయర్ బదులిస్తూ.. మీరు ప్రతిపక్ష పార్టీకి అమ్ముడుపోయినట్లు అనిపిస్తోందని అన్నాడు. మాటా మాటా పెరిగి గోపీ గణేష్ స్టూడియో నుంచి వెళ్లిపోవడానికి పైకి లేచాడు. ఐతే ఇంటర్వ్యూయర్ ఆయనకి సర్దిచెప్పి కొన్ని నిమిషాల తర్వాత ఇంటర్వ్యూ కొనసాగేలా చూశాడు. ఈ వీడియో యూట్యూబ్లో బాగానే తిరుగుతోంది. కాకపోతే ఇదంతా సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి చేసిన ప్లాన్డ్ కాంట్రవర్శీయేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on June 15, 2022 12:28 pm
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…