బాలీవుడ్ బాహుబలిగా అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్న బ్రహ్మస్త్ర ట్రైలర్ ఇవాళ విడుదలయ్యింది.. తెలుగు వెర్షన్ కు రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే దగ్గరుండి తెలుగు రాష్ట్రాలకు టీమ్ ని తిప్పుతూ ప్రమోషన్లు గట్రా చేయిస్తున్నారు. కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర చేయడంతో ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. కాకపోతే ముందు నుంచి పాజిటివ్ గా అనిపించిన వైబ్రేషన్స్ ఒక్కసారిగా ట్రైలర్ వచ్చాక మారిపోయినట్టు కనిపిస్తోంది. భారీ అంచనాలు పెట్టేసుకున్న నార్త్ ఆడియన్స్ ని సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేదని అధిక శాతం కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా అందులో విజువల్స్, గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. వీడియో గేమ్ తరహాలో అనిపిస్తున్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ యువకుడికి తనకు అతీత శక్తులు ఉన్నాయనేది తెలియదు. తర్వాత జరిగిన సంఘటనల వల్ల అగ్ని తననేమి చేయలేదని తెలుసుకుంటాడు. బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం తన శరీరమని మిత్రులు, శత్రువులు గుర్తిస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాల క్రమమే దీని కథ. ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో ఈ ట్రయిలర్ కోసం వాయిస్ ఓవర్ ఇప్పించడం నిన్న వీడియో రూపంలో చూశాంగా.
ఇంత బలమైన లైన్, క్యాస్టింగ్ పెట్టుకున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వావ్ అనిపించేలా ఉండాలి. కానీ ట్రైలర్ లో చూపించిన షాట్స్ లో ఏది వెలితి కనిపిస్తోంది. ఎంతసేపూ అగ్గిని రాజేస్తూ గాలిని చీల్చుకుంటూ వెళ్లే సీన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్వాలిటీలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బ్రహ్మాస్త్రం మూడు భాగాలతో రూపొందుతోంది. ఈ ఫస్ట్ పార్ట్ శివ విజయం సాధించడం మీదే మిగిలిన రెండు సీక్వెల్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీన్నో ఫ్రాంచైజ్ లా చేయాలని నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఆలోచన. మరి అసలు సినిమాలో ఇక్కడ రివీల్ చేయని సర్ప్రైజులు ఏమైనా ఉన్నాయేమో సెప్టెంబర్ 9న చూడాలి
This post was last modified on June 15, 2022 11:07 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…