వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ‘F3’ ఓ మోస్తరు సక్సెస్ అనిపించుకుంది. తొలి వారం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకుంది. అక్కడి నుండి యూనిట్ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాను పుష్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వెంకీ , వరుణ్ ఈ సినిమాను రిలీజ్ తర్వాత కూడా బాగా ప్రమోట్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి కూడా రిలీజ్ కి ముందు బజ్ తీసుకురావడంలో సక్సెస్ సాధించి థియేటర్స్ కి ప్రేక్షకులను రాప్పించగలిగాడు. ఇక రిలీజ్ కి ముందు మెహ్రీన్ కూడా ప్రమోషన్స్ లో బాగానే కనిపించింది. తమన్నా మాత్రం ఎఫ్ 3 ప్రమోషన్స్ లో కనిపించకుండా మిగతా సొంత ఈవెంట్స్ కవర్ చేసుకుంది.
అయితే తమన్నా ఒక్కద్దే కాదు మొదటి నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించలేదు. నిజానికి దేవి కొన్ని రోజులు ఏవో ఈవెంట్స్ తో అలాగే అబ్రాడ్ టూర్ లో బిజీగా ఉన్నాడు. కానీ రిలీజ్ కి ముందు లేదా రిలీజ్ తర్వాత ఒక్క ఈవెంట్ కి కూడా దేవి రాకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అనిల్ రావిపూడి కి తమన్నా కి షూటింగ్ లో చిన్న గొడవ జరిగింది. ఈ విషయాన్ని అనీలే స్వయంగా చెప్పుకున్నాడు కానీ ఇప్పుడెం లేదని తమన్నా వేరే షూటింగ్ లో బిజీ అంటూ కవర్ చేసుకున్నాడు. ఇక రిలీజ్ తర్వాత తమన్నా కి తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏదో చిన్న తేడా వచ్చిందని ఇన్సైడ్ టాక్.
ఏదేమైనా తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ దేవి ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎందుకు స్కిప్ చేశాడనేది మాత్రం తెలియడం లేదు. నిజంగానే బిజీగా ఉన్నాడా లేదా డైరెక్టర్ అనిల్ కి అతనికి ఏమైనా ఇష్యూ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సక్సెస్ మీట్ లో ఈసారి వెంకటేష్ మిస్ అయ్యాడు. వెంకీ లేకపోవడంతో ఈవెంట్ లో ఏదో వెలితి కనిపించింది.
This post was last modified on June 14, 2022 9:07 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…