వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ‘F3’ ఓ మోస్తరు సక్సెస్ అనిపించుకుంది. తొలి వారం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకుంది. అక్కడి నుండి యూనిట్ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాను పుష్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వెంకీ , వరుణ్ ఈ సినిమాను రిలీజ్ తర్వాత కూడా బాగా ప్రమోట్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి కూడా రిలీజ్ కి ముందు బజ్ తీసుకురావడంలో సక్సెస్ సాధించి థియేటర్స్ కి ప్రేక్షకులను రాప్పించగలిగాడు. ఇక రిలీజ్ కి ముందు మెహ్రీన్ కూడా ప్రమోషన్స్ లో బాగానే కనిపించింది. తమన్నా మాత్రం ఎఫ్ 3 ప్రమోషన్స్ లో కనిపించకుండా మిగతా సొంత ఈవెంట్స్ కవర్ చేసుకుంది.
అయితే తమన్నా ఒక్కద్దే కాదు మొదటి నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించలేదు. నిజానికి దేవి కొన్ని రోజులు ఏవో ఈవెంట్స్ తో అలాగే అబ్రాడ్ టూర్ లో బిజీగా ఉన్నాడు. కానీ రిలీజ్ కి ముందు లేదా రిలీజ్ తర్వాత ఒక్క ఈవెంట్ కి కూడా దేవి రాకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అనిల్ రావిపూడి కి తమన్నా కి షూటింగ్ లో చిన్న గొడవ జరిగింది. ఈ విషయాన్ని అనీలే స్వయంగా చెప్పుకున్నాడు కానీ ఇప్పుడెం లేదని తమన్నా వేరే షూటింగ్ లో బిజీ అంటూ కవర్ చేసుకున్నాడు. ఇక రిలీజ్ తర్వాత తమన్నా కి తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏదో చిన్న తేడా వచ్చిందని ఇన్సైడ్ టాక్.
ఏదేమైనా తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ దేవి ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎందుకు స్కిప్ చేశాడనేది మాత్రం తెలియడం లేదు. నిజంగానే బిజీగా ఉన్నాడా లేదా డైరెక్టర్ అనిల్ కి అతనికి ఏమైనా ఇష్యూ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సక్సెస్ మీట్ లో ఈసారి వెంకటేష్ మిస్ అయ్యాడు. వెంకీ లేకపోవడంతో ఈవెంట్ లో ఏదో వెలితి కనిపించింది.
This post was last modified on June 14, 2022 9:07 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…