ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టు చూస్తే అందులో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఇటివలే ‘లవ్ స్టోరి’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పకరించిన సాయి పల్లవి ‘విరాటపర్వం’ తో త్వరలోనే మరోసారి థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. వెన్నెల పాత్ర సినిమాకు హైలైట్ కానుందని టీం గట్టిగా చెప్తోంది.
అయితే నెలల గ్యాప్ లో తెలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే సాయి పల్లవి ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకోబోతుంది. అవును సాయి పల్లవి నెక్స్ట్ లిస్టులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ విషయం తనే మీడియాకి చెప్పుకుంది. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నానని, ఇంకా ఏమి ఫైనల్ చేయలేదని తెలిపింది. తమిళ్ లో ‘గార్గి’ అనే సినిమాతో పాటు శివ కార్తికేయన్ తో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పుకుంది.
అంటే ‘విరాటపర్వం’ తర్వాత సాయి పల్లవి లిస్టులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదన్న మాట. మరి త్వరలోనే ఏదైనా సినిమా ఓకె చేసుకొని సైన్ చేస్తుందా ? లేదా తెలుగులో కొంచెం బ్రేక్ తీసుకోనుందా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈవెంట్స్ లో తన క్రేజ్ తో అందరికీ మతి పోగోడుతున్న సాయి పల్లవి చకచకా తెలుగు సినిమాలు చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు…
సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…
రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…
డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…
ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో.. వైరల్ అయిపోతారో చెప్పలేం. కొన్నేళ్ళ ముందు అక్కినేని కుర్రాడు…