నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరనికీ’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. నాని పెర్ఫార్మెన్స్ , నజ్రియా , కామెడీ సీన్స్ ,వివేక్ రైటింగ్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమాకు లెంగ్త్ అనేది డ్రాగ్ బ్యాక్ అయ్యింది. దీంతో రిలీజ్ రోజు మార్నింగ్ షో నుండే రన్ టైం గురించి ప్రేక్షకులను నుండి ఫీడ్ బ్యాక్ వచ్చేసింది.
రెండో రోజు కచ్చితంగా మేకర్స్ ఆ జాగ్రత్త తీసుకొని కొంచెం ట్రిమ్ చేసి రన్ టీం తగ్గిస్తారేమో అని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. సినిమాకు సంబంధించి రెండు గంటల యాబై ఆరు నిమిషాల నిడివినే ఉంచేశారు మేకర్స్. ఒక్క ముక్క కూడా తీయకుండా ఆ విషయంలో తగ్గేదే లే అంటూ నమ్మిన సిద్దాంతాన్ని పట్టుకొని కూర్చున్నారు.
తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో కూడా రన్ టైం ఎక్కువైంది అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు కదా ఏమైనా తగ్గించే ఆలోచన ఉందా ? అనే ప్రశ్న టీంకి మీడియా నుండి ఎదురైంది.దీనికి దర్శకుడు వివేక్ ఆత్రేయ నుండి జబాబు వచ్చింది. అలాంటిదేం లేదంటూ ఫస్ట్ హాఫ్ లో ఆ స్పీస్ తీసుకొని చెప్పడం వల్లే సెకండాఫ్ బాగా వర్కౌట్ అయిందంటూ సో ఫస్ట్ హాఫ్ లో ఆ రన్ టైం ఉండాల్సిందే అన్నాడు.
అంతే కాదు సెకండాఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన నాకు ఫస్ట్ హాఫ్ ని తీయడం రాక కాదు అందులో అవన్నీ చూపిస్తేనే సినిమా బాగుంటుంది అంటూ ఏదో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా అంటే కి రన్ టైం ఎక్కువ ఉండటం దాంతో కంటెంట్ డ్రాగ్ అనిపిస్తూ థియేటర్స్ లో కాస్త బోర్ కొట్టిస్తుంది. మేకర్స్ మాత్రం ఆ విషయంలోనే తగ్గదే లే అంటూ గట్టి పట్టు పట్టారు. ఏదేమైనా రిలీజ్ కి ముందు టీం నిడివి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని కొన్ని సీన్స్ తొలగించి ఉంటె యుననిమాస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చేది.
This post was last modified on June 13, 2022 9:01 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…