తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఆడియన్స్ అందరికీ ఫేవరేట్ హీరోయిన్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ కోసమే సినిమాలు చూసే వాళ్ళ లిస్టు చాలానే ఉంది. అయితే ఈ రేంజ్ సక్సెస్ అందుకొని రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్న సాయి పల్లవి తాజాగా తన పెర్సనల్ విషయాలు కొన్ని బయట పెట్టింది.
నిజానికి సాయి పల్లవి రెమ్యునరేషన్ అంతా వాళ్ళ అమ్మ అకౌంట్ లోకి వెళ్ళిపోతుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకుంది సాయి పల్లవి. అయితే ఒక్కోసారి ఆన్లైన్ లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఓటీపి అమ్మకి వెళ్తుందని చెప్పింది.
ఇక తల్లిదండ్రులే తనకి చిన్నతనం నుండి ఏం కావాలో అది అందిస్తూ వచ్చారని ఇప్పుడు తన సంపాదన తన చేతిలో కాకుండా వాళ్ళ చేతిలో ఉంటేనే కూతురుగా తను హ్యాప్పీ అంటూ తెలిపింది. ఇక వాళ్లకి కూడా ఇప్పటికీ ఏది కావాలన్నా మనల్నే అడుగుతుందని ఓ మంచి ఫీలింగ్ ఉంటుందని అందుకే ఫైనాన్షియల్ మేటర్స్ అంతా వాళ్ళకే అప్పగించేశానని చెప్పుకుంది.
ఇక ఇంకో ఇంటరెస్టింగ్ విషయం కూడా చెప్పుకుంది సాయి పల్లవి. శర్వానంద్ తో నటించిన ‘పడి పడి లేచె మనసు’ సినిమా సక్సెస్ అవ్వలేదు కాబట్టి బ్యాలెన్స్ రెమ్యునరేషన్ వద్దని అమ్మ నిర్మాత సుధాకర్ గారితో చెప్పిందని కానీ ఆయన అమ్మ మాట వినకుండా బ్రతిమిలాడి మిగతా రెమ్యునరేషన్ క్లోజ్ చేశారని చెప్పుకుంది. సో సినిమా సక్సెస్ అవ్వకపోతే హీరోయిన్ ఇలా రెమ్యునరేషన్ వద్దని చెప్పడం సాయి పల్లవి విషయంలోనే జరిగి ఉండొచ్చు. ఏదేమైనా తన తల్లి దండ్రుల పట్ల ఇప్పటికే సాయి పల్లవి అదే ప్రేమ , గౌరవంతో ఉండటం మెచ్చుకోదగిన విషయమే.
This post was last modified on June 13, 2022 5:15 pm
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…