తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఆడియన్స్ అందరికీ ఫేవరేట్ హీరోయిన్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ కోసమే సినిమాలు చూసే వాళ్ళ లిస్టు చాలానే ఉంది. అయితే ఈ రేంజ్ సక్సెస్ అందుకొని రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్న సాయి పల్లవి తాజాగా తన పెర్సనల్ విషయాలు కొన్ని బయట పెట్టింది.
నిజానికి సాయి పల్లవి రెమ్యునరేషన్ అంతా వాళ్ళ అమ్మ అకౌంట్ లోకి వెళ్ళిపోతుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకుంది సాయి పల్లవి. అయితే ఒక్కోసారి ఆన్లైన్ లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఓటీపి అమ్మకి వెళ్తుందని చెప్పింది.
ఇక తల్లిదండ్రులే తనకి చిన్నతనం నుండి ఏం కావాలో అది అందిస్తూ వచ్చారని ఇప్పుడు తన సంపాదన తన చేతిలో కాకుండా వాళ్ళ చేతిలో ఉంటేనే కూతురుగా తను హ్యాప్పీ అంటూ తెలిపింది. ఇక వాళ్లకి కూడా ఇప్పటికీ ఏది కావాలన్నా మనల్నే అడుగుతుందని ఓ మంచి ఫీలింగ్ ఉంటుందని అందుకే ఫైనాన్షియల్ మేటర్స్ అంతా వాళ్ళకే అప్పగించేశానని చెప్పుకుంది.
ఇక ఇంకో ఇంటరెస్టింగ్ విషయం కూడా చెప్పుకుంది సాయి పల్లవి. శర్వానంద్ తో నటించిన ‘పడి పడి లేచె మనసు’ సినిమా సక్సెస్ అవ్వలేదు కాబట్టి బ్యాలెన్స్ రెమ్యునరేషన్ వద్దని అమ్మ నిర్మాత సుధాకర్ గారితో చెప్పిందని కానీ ఆయన అమ్మ మాట వినకుండా బ్రతిమిలాడి మిగతా రెమ్యునరేషన్ క్లోజ్ చేశారని చెప్పుకుంది. సో సినిమా సక్సెస్ అవ్వకపోతే హీరోయిన్ ఇలా రెమ్యునరేషన్ వద్దని చెప్పడం సాయి పల్లవి విషయంలోనే జరిగి ఉండొచ్చు. ఏదేమైనా తన తల్లి దండ్రుల పట్ల ఇప్పటికే సాయి పల్లవి అదే ప్రేమ , గౌరవంతో ఉండటం మెచ్చుకోదగిన విషయమే.
This post was last modified on June 13, 2022 5:15 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…