సైరా తర్వాత చిరంజీవి ఎంచుకుంటున్న సినిమాల వరస చూస్తుంటే అందులో ఎవరో ఒకరు ఇప్పటి జెనరేషన్ హీరో ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. అది కాకతాళీయంగా జరిగిందో లేక అలా ప్లాన్ చేసుకుని సెట్ చేసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి రకరకాల కాంబోలు వస్తున్నాయి. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పెద్దగా ఉపయోగపడలేదు. గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ ఏ మేరకు ప్లస్ అవుతాడో ఫలితం వచ్చాకే తెలుస్తుంది. వాల్తేర్ వీరయ్యలో రవితేజ ఉన్నాడనే ప్రకటనే అంచనాలు పెంచేసింది.
తాజాగా భోళాశంకర్ కు సైతం అలాంటి టాకే వినిపిస్తోంది. ఇందులో మెగాస్టార్ చెల్లిలిగా నటిస్తున్న కీర్తి సురేష్ కు జోడిగా యంగ్ హీరో నితిన్ ని లాక్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే చేశారని వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో యవ దర్శకులు కుర్ర స్టార్లు చిరుతో ఒక నోస్టాల్జిక్ మెమరీ కావాలని తాపత్రయపడుతున్నారు. డైరెక్టర్లు రిఫరెన్సులు ఇంటర్వ్యూల రూపంలో వాడితే, హీరోలు ఎక్కువా తక్కువాని పాత్రతో సంబంధం లేకుండా ఛాన్స్ ఉంటే చాలు వీలైనంత చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు.
బహుశా నితిన్ కూడా ఈ కోణంలోనే ఆలోచించి ఉండొచ్చు. అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి. ఇక భోళా శంకర్ షూటింగ్ త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. గాడ్ ఫాదర్ తాలూకు పనులన్నీ దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. సల్మాన్ తో చేయాల్సిన పాట షూట్ ఒకటి బ్యాలన్స్ ఉంది. ఆయన ఎలాగూ హైదరాబాద్ లోనే ఉన్నాడు కాబట్టి ఫినిష్ చేసేయొచ్చు. అయితే వాల్తేర్ వీరయ్య ఫస్ట్ రిలీజవుతుందా లేక భోళా శంకర్ ను రేస్ లో ముందు నిలుపుతారా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఆ ప్రశ్నకు సమాధానం తెలిసింది ఒక్క చిరుకే.
This post was last modified on June 13, 2022 12:08 pm
మెగాస్టార్ చిరంజీవి కొంత గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ వేటకు సిద్ధమయ్యారు. భోళా శంకర్తో ఘోరమైన ఫలితాన్ని అందుకున్న చిరు.. రెండున్నరేళ్ల…
సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో సామాన్యులనే కాదు, చదువుకున్నవారినీ నిలువునా ముంచేస్తున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతితో ప్రకాశం…
ఈ మధ్యే ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ప్రభాస్ పేరు ముందు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అంటూ ట్యాగ్…
కొందరు పరభాషా కథానాయికలను చూస్తే.. వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు అనే ఫీలింగే రాదు. చక్కగా తెలుగు నేర్చుకుని,…
ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర దాటినా ఇంకా స్ట్రగులవుతూనే ఉన్న హీరోల్లో నందు ఒకడు. మధ్యలో సపోర్టింగ్ రోల్స్ చేశాడు కానీ…
దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా,…