ఏ సినిమా అయినా థియేటర్ సక్సెసనేది కలెక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే నెంబర్లను బట్టే దాని అసలు ఫలితం డిసైడ్ అవుతుంది. కానీ ఆ అవకాశం ఓటిటిలో ఉండదు.యుట్యూబ్ తరహాలో ఇన్నేసి మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పేందుకు సాధారణంగా ఏ సంస్థ ఇష్టపడదు. కానీ విపరీతంగా పెరిగిపోయిన పోటీ వల్ల ఇప్పుడా ట్రెండ్ మెల్లగా మారుతోంది. తమ ప్లాట్ ఫార్మ్ లో చందాదారులు ఎన్ని నిముషాలు ఎన్ని గంటల సేపు కొత్త కంటెంట్ ని చూశారో ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు.
అందరి చూపు సహజంగానే ఆర్ఆర్ఆర్ మీద వెళ్తోంది. తెలుగు సహా నాలుగు భాషల్లో జీ5 స్ట్రీమింగ్ చేయగా హిందీ వెర్షన్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ ఒక్కదానికే భారీగా మార్కెటింగ్ చేసింది. అయితే దేంట్లో ఎక్కువ చూశారని ఆసక్తి కలగడం సహజం. అవేంటో చూద్దాం. జీ5 చెప్పిన ప్రకారం ట్రిపులార్ 190 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. 1000 మిలియన్ నిమిషాల వ్యూస్ వచ్చాయని అఫీషియల్ గా ప్రకటించింది. అంటే గంటల లెక్కలో చూసుకుంటే 16,666,667 గంటలన్న మాట. ఇది జీ5లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ కలిపి.
ఇక నెట్ ఫ్లిక్స్ సంగతి చూస్తే మూడు వారాల దాకా 39,480,000 గంటల వ్యూస్ సాధించింది. సింపుల్ గా చెప్పాలంటే జీ5 కన్నా నెట్ ఫ్లిక్స్ లో 22,813,334 గంటల వ్యూస్ అధికంగా వచ్చాయి. ఎలా చూసుకున్న రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. నెట్ ఫ్లిక్స్ కున్న గ్లోబల్ రీచ్ ఆర్ఆర్ఆర్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. దేశవిదేశాల నుంచి సెలబ్రిటీ ట్వీట్లు ట్రిపులార్ ని పొగడ్తలతో ముంచెత్తాయి. కంటెంట్ ప్రమోషన్, క్వాలిటీ విషయంలో కొంత వెనుకబడి ఉన్న జీ5 ఇండియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ ని నెంబర్ వన్ గా ఉంచేసింది. రాటెన్ టొమాటోస్ లో ఆర్ఆర్ఆర్ నమోదయ్యాక దీని గురించిన ప్రచారం మరింతగా పెరిగిపోయింది. రాజమౌళా మజాకా.
This post was last modified on June 12, 2022 6:25 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…