వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం సరోగేట్ యాడ్స్ ని నిషేధించింది. సరోగేట్ యాడ్స్ అంటే ఏమిటి ? ఏమిటంటే ప్రచారం చేయటానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటిపేరుతోనే అదేరీతిలో ఉండేట్లుగా కనిపించేలాగ అడ్వర్టైజ్మెంట్లను చూపించటం.
కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఇపుడు కనబడుతున్న ప్రకటనలకు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. ఈ ప్రకటనల్లో కనబడుతున్న ప్రముఖులు, సెలబ్రిటీలపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టంగా చెప్పింది. వినియోగదారులను ఆకర్షించేలా రాయితీలు, ఉచితాల వంటి ప్రకటనలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. అలాగే పిల్లలను టార్గెట్ గా చేసుకుని కనిపించే యాడ్స్ కు కూడా ఇవే వర్తిస్తాయి.
‘తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధం-22’ పేరుతో వినియోగదారుల రక్షణ చట్టం పేరుతో కేంద్రం మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది. తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటిసారి చట్టాన్ని ఉల్లంఘించే అడ్వర్టైజ్మెంట్లకు రు. 10 లక్షల ఫైన్ వేస్తారు. తర్వాత ప్రతిసారి రు. 50 లక్షల చొప్పున జరిమానా విధిస్తారు. తయారీదారులు, ప్రచారకర్తలు, ప్రకటనకర్తలు అందరికీ మార్గదర్శకాలు కచ్చితంగా వర్తిస్తాయి వార్నింగ్ ఇచ్చింది.
మార్గదర్శకాలకు విరుద్ధంగా కనిపించిన ప్రకటనల్లో కనిపించిన సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రకటనలను తయారు చేసిన అడ్వర్టైజ్మెంట్ సంస్ధలకు, ఉత్పత్తుల తయారీ సంస్ధలకు కూడా ఈ ఫైన్లు వర్తిస్తాయి. ప్రకటనలు జనాలను బాగా ఆకర్షిస్తుంది. లిక్కర్ ప్రకటనలను పోలినట్లుండే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇపుడు టీవీల్లో కనబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. టీవీల్లో కనబడరిచే ప్రకటనల్లో మినరల్ వాటర్ అని షోడాని చెబుతుంటారు. కానీ సదరు ప్రకటనను చూస్తున్నపుడు అందరికీ గుర్తుకొచ్చేది లిక్కర్ మాత్రమే. ఇలాంటి ప్రకటనలు టీవీల్లో చాలానే కనబడుతుంటాయి. అలాంటి వాటిల్లో కనిపించే సెలబ్రిటీలకూ ఇకనుండి ఫైన్ పడుతుంది. అంటే డబ్బుకోసం కక్కుర్తిపడే సెలబ్రిటీలు ఇకనుండి జాగ్రత్తగా ఉండకపోతే బుక్ అయిపోవటం ఖాయం.
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…