Movie News

సెలబ్రిటీలకూ షాకిచ్చిన కేంద్రం

వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం సరోగేట్ యాడ్స్ ని నిషేధించింది. సరోగేట్ యాడ్స్ అంటే ఏమిటి ? ఏమిటంటే ప్రచారం చేయటానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటిపేరుతోనే అదేరీతిలో ఉండేట్లుగా కనిపించేలాగ అడ్వర్టైజ్మెంట్లను చూపించటం.

కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఇపుడు కనబడుతున్న ప్రకటనలకు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. ఈ ప్రకటనల్లో కనబడుతున్న ప్రముఖులు, సెలబ్రిటీలపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టంగా చెప్పింది. వినియోగదారులను ఆకర్షించేలా రాయితీలు, ఉచితాల వంటి ప్రకటనలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. అలాగే పిల్లలను టార్గెట్ గా చేసుకుని కనిపించే యాడ్స్ కు కూడా ఇవే వర్తిస్తాయి.

‘తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధం-22’ పేరుతో వినియోగదారుల రక్షణ చట్టం పేరుతో కేంద్రం మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది. తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటిసారి చట్టాన్ని ఉల్లంఘించే అడ్వర్టైజ్మెంట్లకు రు. 10 లక్షల ఫైన్ వేస్తారు. తర్వాత ప్రతిసారి రు. 50 లక్షల చొప్పున జరిమానా విధిస్తారు. తయారీదారులు, ప్రచారకర్తలు, ప్రకటనకర్తలు అందరికీ మార్గదర్శకాలు కచ్చితంగా వర్తిస్తాయి వార్నింగ్ ఇచ్చింది.

మార్గదర్శకాలకు విరుద్ధంగా కనిపించిన ప్రకటనల్లో కనిపించిన సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రకటనలను తయారు చేసిన అడ్వర్టైజ్మెంట్ సంస్ధలకు, ఉత్పత్తుల తయారీ సంస్ధలకు కూడా ఈ ఫైన్లు వర్తిస్తాయి. ప్రకటనలు జనాలను బాగా ఆకర్షిస్తుంది. లిక్కర్ ప్రకటనలను పోలినట్లుండే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇపుడు టీవీల్లో కనబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. టీవీల్లో కనబడరిచే ప్రకటనల్లో మినరల్ వాటర్ అని షోడాని చెబుతుంటారు. కానీ సదరు ప్రకటనను చూస్తున్నపుడు అందరికీ గుర్తుకొచ్చేది లిక్కర్ మాత్రమే. ఇలాంటి ప్రకటనలు టీవీల్లో చాలానే కనబడుతుంటాయి. అలాంటి వాటిల్లో కనిపించే సెలబ్రిటీలకూ ఇకనుండి ఫైన్ పడుతుంది. అంటే డబ్బుకోసం కక్కుర్తిపడే సెలబ్రిటీలు ఇకనుండి జాగ్రత్తగా ఉండకపోతే బుక్ అయిపోవటం ఖాయం.

This post was last modified on June 12, 2022 12:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

1 hour ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

1 hour ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

2 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

3 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

4 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

5 hours ago