Movie News

సుందరం లీలకు అసలు పరీక్ష

పబ్లిక్ టాక్ బాగానే ఉంది. రివ్యూలు మెచ్చుకున్నాయి. కొంత గ్యాప్ తరువాత పాత నానిని చూశామని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నా అంటే సుందరం బాక్సాఫీస్ పరిస్థితి మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంది.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగు కోట్లకు దగ్గరగా వెళ్లిన షేర్ రెండో రోజు పర్వాలేదనిపించుకుంది. ఇవాళ ఆదివారం కాబట్టి మంచి నెంబర్స్ నమోదవుతాయి కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఉండాల్సిన రేంజ్ లో లేవని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.

లెన్త్ విషయంలో ఎన్ని కామెంట్స్ వస్తున్నప్పటికీ నిర్మాణ సంస్థ వాటిని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ట్రిమ్ చేసే సూచనలు దరిదాపుల్లో లేవు. అలాంటిది ఏదైనా ఉంటే వీలైనంత త్వరగా చేస్తే మంచిది. లేకపోతే లాభముండదు.

తెలంగాణలో టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ పై ప్రభావం చూపిస్తున్నాయని ఎందరు మొత్తుకుంటున్నా నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. మేజర్, విక్రమ్ లకు హైదరాబాద్ లో 195 రూపాయలు ఉన్న మల్టీ ప్లెక్స్ ధర అంటే సుందరానికి 250కి పెరిగిపోయింది.

ఇలాంటి అంశాలే వసూళ్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎఫ్3 సైతం ఇదే తరహా సమస్యను ఎదురుకుని కలెక్షన్లను తగ్గించుకోడం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏపిలో నార్మల్ గా ఉన్నందు వల్ల అక్కడ డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ పెద్దలు గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు విశ్లేషించుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది.

స్టేజిల మీద, ఇంటర్వ్యూలలో రెండు ముక్కలు చెప్పేసి తర్వాత రియాలిటీలో తూచ్ అనేయడం మాములైపోయింది. సోమవారం అంటే రేపటి నుంచి అంటే సుందరానికి అసలైన పరీక్ష మొదలుకానుంది. థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న మొత్తానికి ఇంకా సగం దూరం కూడా చేరుకోలేదు మరి.

This post was last modified on June 12, 2022 7:02 pm

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

1 hour ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

3 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

6 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

6 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

6 hours ago