పబ్లిక్ టాక్ బాగానే ఉంది. రివ్యూలు మెచ్చుకున్నాయి. కొంత గ్యాప్ తరువాత పాత నానిని చూశామని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నా అంటే సుందరం బాక్సాఫీస్ పరిస్థితి మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగు కోట్లకు దగ్గరగా వెళ్లిన షేర్ రెండో రోజు పర్వాలేదనిపించుకుంది. ఇవాళ ఆదివారం కాబట్టి మంచి నెంబర్స్ నమోదవుతాయి కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఉండాల్సిన రేంజ్ లో లేవని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.
లెన్త్ విషయంలో ఎన్ని కామెంట్స్ వస్తున్నప్పటికీ నిర్మాణ సంస్థ వాటిని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ట్రిమ్ చేసే సూచనలు దరిదాపుల్లో లేవు. అలాంటిది ఏదైనా ఉంటే వీలైనంత త్వరగా చేస్తే మంచిది. లేకపోతే లాభముండదు.
తెలంగాణలో టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ పై ప్రభావం చూపిస్తున్నాయని ఎందరు మొత్తుకుంటున్నా నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. మేజర్, విక్రమ్ లకు హైదరాబాద్ లో 195 రూపాయలు ఉన్న మల్టీ ప్లెక్స్ ధర అంటే సుందరానికి 250కి పెరిగిపోయింది.
ఇలాంటి అంశాలే వసూళ్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎఫ్3 సైతం ఇదే తరహా సమస్యను ఎదురుకుని కలెక్షన్లను తగ్గించుకోడం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏపిలో నార్మల్ గా ఉన్నందు వల్ల అక్కడ డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ పెద్దలు గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు విశ్లేషించుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది.
స్టేజిల మీద, ఇంటర్వ్యూలలో రెండు ముక్కలు చెప్పేసి తర్వాత రియాలిటీలో తూచ్ అనేయడం మాములైపోయింది. సోమవారం అంటే రేపటి నుంచి అంటే సుందరానికి అసలైన పరీక్ష మొదలుకానుంది. థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న మొత్తానికి ఇంకా సగం దూరం కూడా చేరుకోలేదు మరి.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…