ఇండియాలో థియేటర్లు మూడు నెలల కిందట్నుంచి మూతపడి ఉన్నాయి. థియేటర్లలో బొమ్మ పడక శత దినోత్సవం కూడా పూర్తయింది. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. రాబోయే రెండు మూడు నెలల్లో కూడా థియేటర్లు పున:ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
లాక్డౌన్ కంటే ముందు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలన్నీ ఆపేసి కూర్చున్నారు. థియేటర్లు మళ్లీ తెరుచుకోబోతున్న సంకేతాలు వచ్చినపుడు, తమ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నాక ప్రమోషన్ తిరిగి ఆరంభిస్తారేమో.
అంత వరకు స్తబ్దత కొనసాగేలాగే కనిపిస్తోంది. ఇప్పటికైతే పెద్ద సినిమాల సందడి ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో తమిళ స్టార్ హీరో విశాల్ తన కొత్త చిత్రం ‘చక్ర’ ప్రమోషన్లతో హడావుడి చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కొన్ని రోజుల కిందట ట్రైలర్ గ్లింప్స్తో వార్తల్లోకి వచ్చింది ‘చక్ర’. ఇప్పుడు ఏకంగా ట్రైలరే రిలీజ్ చేసేస్తున్నారు. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునేలా లేవు. ‘చక్ర’ రిలీజ్ డేట్ కూడా ఏమీ ఖరారవ్వలేదు. మరి ఇప్పుడు ఈ ట్రైలర్ హడావుడేంటి అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఒకవేళ ‘చక్ర’ను ఏదైనా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ చేసే సాహసం విశాల్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అలా అయితే తప్ప ఇప్పటికిప్పుడు ట్రైలర్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఇప్పటికే జ్యోతిక సినిమా ‘పొన్ మగళ్ వందాల్’తో పాటు కీర్తి సురేష్ మూవీ ‘పెంగ్విన్’ ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితే అవి మీడియం రేంజ్ సినిమాలే.
ఆ సినిమాలు చూస్తే వీటికి థియేటర్లలో రిలీజయ్యేంత సీన్ లేదు అనిపించింది. ఐతే విశాల్ మూవీ అంటే దాని రేంజ్ వేరు. దానికి థియేట్రికల్ రిలీజే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ విశాల్ కనుక ‘చక్ర’ను ఓటీటీలో రిలీజ్ చేసేట్లయితే.. ఈ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతున్న తొలి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అదే అవుతుంది.
This post was last modified on June 27, 2020 1:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…