ఇండియాలో థియేటర్లు మూడు నెలల కిందట్నుంచి మూతపడి ఉన్నాయి. థియేటర్లలో బొమ్మ పడక శత దినోత్సవం కూడా పూర్తయింది. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. రాబోయే రెండు మూడు నెలల్లో కూడా థియేటర్లు పున:ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
లాక్డౌన్ కంటే ముందు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలన్నీ ఆపేసి కూర్చున్నారు. థియేటర్లు మళ్లీ తెరుచుకోబోతున్న సంకేతాలు వచ్చినపుడు, తమ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నాక ప్రమోషన్ తిరిగి ఆరంభిస్తారేమో.
అంత వరకు స్తబ్దత కొనసాగేలాగే కనిపిస్తోంది. ఇప్పటికైతే పెద్ద సినిమాల సందడి ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో తమిళ స్టార్ హీరో విశాల్ తన కొత్త చిత్రం ‘చక్ర’ ప్రమోషన్లతో హడావుడి చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కొన్ని రోజుల కిందట ట్రైలర్ గ్లింప్స్తో వార్తల్లోకి వచ్చింది ‘చక్ర’. ఇప్పుడు ఏకంగా ట్రైలరే రిలీజ్ చేసేస్తున్నారు. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునేలా లేవు. ‘చక్ర’ రిలీజ్ డేట్ కూడా ఏమీ ఖరారవ్వలేదు. మరి ఇప్పుడు ఈ ట్రైలర్ హడావుడేంటి అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఒకవేళ ‘చక్ర’ను ఏదైనా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ చేసే సాహసం విశాల్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అలా అయితే తప్ప ఇప్పటికిప్పుడు ట్రైలర్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఇప్పటికే జ్యోతిక సినిమా ‘పొన్ మగళ్ వందాల్’తో పాటు కీర్తి సురేష్ మూవీ ‘పెంగ్విన్’ ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితే అవి మీడియం రేంజ్ సినిమాలే.
ఆ సినిమాలు చూస్తే వీటికి థియేటర్లలో రిలీజయ్యేంత సీన్ లేదు అనిపించింది. ఐతే విశాల్ మూవీ అంటే దాని రేంజ్ వేరు. దానికి థియేట్రికల్ రిలీజే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ విశాల్ కనుక ‘చక్ర’ను ఓటీటీలో రిలీజ్ చేసేట్లయితే.. ఈ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతున్న తొలి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అదే అవుతుంది.
This post was last modified on June 27, 2020 1:44 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…