స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా ఆ మధ్య ‘సీనయ్య’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తన బేనర్ కి ‘దిల్’ తో మొదటి సక్సెస్ ఇచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఆ సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేశారు. కానీ అనుకోని విధంగా ఆ సినిమా క్యాన్సెల్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు నరసింహ రావు ఇచ్చిన ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్ళకముందే సినిమా ఆగిపోయింది. ఇక వినాయక్ యాక్టింగ్ కెరీర్ కి మొదటి సినిమానే బ్రేక్ వేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వినాయక్ దర్శకుడిగా ఛత్రపతి హిందీ రీమేక్ మొదలు పెట్టి బిజీ అయిపోయాడు.
అయితే ఇప్పుడు వినాయక్ హీరోగా కొత్త సినిమా ఒకటి ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా వినాయక్ కి ఓ కొత్త దర్శకుడు ఇంట్రెస్టింగ్ కథ చెప్పాడట. వినాయక్ కి కథ బాగా నచ్చడంతో ఆ దర్శకుడిని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేశాడట. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ప్రాజెక్ట్ మాత్రం లాక్ అయిందని అంటున్నారు. అన్ని కుదిరితే దిల్ రాజునే ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ కి సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మిగిలింది. ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసిన వెంటనే తను హీరోగా తెరకెక్కనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడట వినాయక్.
ఇక తెలుగులో నటులుగా మారి సక్సెసయిన దర్శకులు కొందరున్నారు. దాసరి , కే విశ్వనాధ్ వంటి వారు నటులుగా రాణించి మంచి పాత్రలను పోషించారు. మరి వినాయక్ నటుడిగా ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూడాలి.
This post was last modified on June 11, 2022 9:40 pm
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…