స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా ఆ మధ్య ‘సీనయ్య’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తన బేనర్ కి ‘దిల్’ తో మొదటి సక్సెస్ ఇచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఆ సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేశారు. కానీ అనుకోని విధంగా ఆ సినిమా క్యాన్సెల్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు నరసింహ రావు ఇచ్చిన ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్ళకముందే సినిమా ఆగిపోయింది. ఇక వినాయక్ యాక్టింగ్ కెరీర్ కి మొదటి సినిమానే బ్రేక్ వేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వినాయక్ దర్శకుడిగా ఛత్రపతి హిందీ రీమేక్ మొదలు పెట్టి బిజీ అయిపోయాడు.
అయితే ఇప్పుడు వినాయక్ హీరోగా కొత్త సినిమా ఒకటి ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా వినాయక్ కి ఓ కొత్త దర్శకుడు ఇంట్రెస్టింగ్ కథ చెప్పాడట. వినాయక్ కి కథ బాగా నచ్చడంతో ఆ దర్శకుడిని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేశాడట. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ప్రాజెక్ట్ మాత్రం లాక్ అయిందని అంటున్నారు. అన్ని కుదిరితే దిల్ రాజునే ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ కి సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మిగిలింది. ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసిన వెంటనే తను హీరోగా తెరకెక్కనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడట వినాయక్.
ఇక తెలుగులో నటులుగా మారి సక్సెసయిన దర్శకులు కొందరున్నారు. దాసరి , కే విశ్వనాధ్ వంటి వారు నటులుగా రాణించి మంచి పాత్రలను పోషించారు. మరి వినాయక్ నటుడిగా ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూడాలి.
This post was last modified on June 11, 2022 9:40 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…