స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా ఆ మధ్య ‘సీనయ్య’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తన బేనర్ కి ‘దిల్’ తో మొదటి సక్సెస్ ఇచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఆ సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేశారు. కానీ అనుకోని విధంగా ఆ సినిమా క్యాన్సెల్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు నరసింహ రావు ఇచ్చిన ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్ళకముందే సినిమా ఆగిపోయింది. ఇక వినాయక్ యాక్టింగ్ కెరీర్ కి మొదటి సినిమానే బ్రేక్ వేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వినాయక్ దర్శకుడిగా ఛత్రపతి హిందీ రీమేక్ మొదలు పెట్టి బిజీ అయిపోయాడు.
అయితే ఇప్పుడు వినాయక్ హీరోగా కొత్త సినిమా ఒకటి ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా వినాయక్ కి ఓ కొత్త దర్శకుడు ఇంట్రెస్టింగ్ కథ చెప్పాడట. వినాయక్ కి కథ బాగా నచ్చడంతో ఆ దర్శకుడిని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేశాడట. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ప్రాజెక్ట్ మాత్రం లాక్ అయిందని అంటున్నారు. అన్ని కుదిరితే దిల్ రాజునే ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ కి సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మిగిలింది. ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసిన వెంటనే తను హీరోగా తెరకెక్కనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడట వినాయక్.
ఇక తెలుగులో నటులుగా మారి సక్సెసయిన దర్శకులు కొందరున్నారు. దాసరి , కే విశ్వనాధ్ వంటి వారు నటులుగా రాణించి మంచి పాత్రలను పోషించారు. మరి వినాయక్ నటుడిగా ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూడాలి.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…