మాములుగా స్టార్ హీరోయిన్లు కొత్త సినిమాల ప్రమోషన్లకు రావడమే మహాభాగ్యంలా ఫీలవుతుంటారు నిర్మాతలు. ఇక నయనతార లాంటి వాళ్ళు సరేసరి. అగ్రిమెంట్ చేసే టైంలోనే ఎక్కడికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తారు. చిరంజీవైనా సత్యదేవైనా తేడా చూపించరు. అలాంటిది వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన విరాట పర్వం కోసం సాయిపల్లవి ఎడతెరిపి లేకుండా పబ్లిసిటీలో పాల్గొనడం మెచ్చుకోవాల్సిన విషయమే. గత వారం రోజులుగా పూర్తిగా హైదరాబాద్ లోనే మకాం వేసి అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవుతోంది.
రానా సైతం వీలు చిక్కినప్పుడంతా ఆమెనే హైలైట్ చేస్తున్నాడు. ఇవాళ ఇచ్చిన ఇంటర్వ్యూలో రవన్న క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని కానీ సాయిపల్లవికి మాత్రం మరో ఆప్షన్ లేదని ఖరాఖండిగా ఎలాంటి ఈగో లేకుండా చెప్పేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోమోలో సైతం ఆమె కోసమే సినిమా తీశామని నొక్కి వక్కాణించాడు. ఇలా భాగ్యనగరంలో గడుపుతున్న టైంలోనే సాయిపల్లవికి ఓ టీవీ ఛానల్ తమ సీరియల్ యాడ్స్ లో జస్ట్ కొన్ని నిమిషాలు నటిస్తే రెండు కోట్ల ఆఫర్ ఇస్తే నిర్మోహమాటంగా తిరస్కరించిందని మీడియా వర్గాల టాక్.
మొత్తానికి విరాటపర్వం భారం అధికంగా సాయిపల్లవి మీదే ఉంది. ఓపెనింగ్స్ విషయంలోనూ ఆమె బ్రాండే హెల్ప్ చేసేలా ఉంది. సినిమా బాగుంటే ఎలాగూ మౌత్ టాక్ రూపంలో పాకిపోతుంది కానీ మొదటి రెండు మూడు రోజులు జనం థియేటర్లకు రావాలంటే ఫస్ట్ రీజన్ తనే అవుతోంది. అందుకే ఆహాలో షో, యుట్యూబ్ ముఖాముఖీలు, న్యూస్ ఛానల్స్ కార్యక్రమాలు, రోడ్ ట్రిప్పులు, కర్నూల్ నుంచి వరంగల్ దాకా రకరకాల ఈవెంట్లు దేనికీ నో చెప్పకుండా వెళ్ళిపోతోంది. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం చేయగలరు.
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…