Movie News

అల్లు శిరీష్‌ను ఎందుకిలా వదిలేస్తున్నారు?

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్లోకి అరంగేట్రం చేశారు. అందులో చాలామంది హీరోలుగా పెద్ద రేంజికి వెళ్లారు. కొందరు మీడియం రేంజి హీరోలుగా కొనసాగుతున్నారు. చివరగా ఈ కుటుంబం నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ కూడా అరంగేట్రంలోనే ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమా ‘కొండపొలం’తో తన అభిరుచిని చాటుకున్నాడు.

ఇప్పుడు అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఐతే పదేళ్ల కిందటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం కెరీర్లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు లేవు. చివరగా ‘ఏబీసీడీ’ లాంటి ఫ్లాప్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు శిరీష్.

మామూలుగా పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చే హీరోలను ఎలాగోలా పైకి తేవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. విరామం లేకుండా సినిమాలు చేయిస్తారు. కాస్త పేరున్న దర్శకులను ఎంచుకుంటారు. కానీ మంచి బిజినెస్‌మ్యాన్ అయిన అల్లు అరవింద్ మాత్రం తన చిన్న కొడుకు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదని మొదట్నుంచి అనిపిస్తూనే ఉంది.

సొంత బేనర్లో అతడితో చిన్న బడ్జెట్లలో ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేశారాయన. ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ కెరీర్‌కు కొంచెం ఊపు వచ్చినట్లు కనిపించినా.. ‘ఒక్కక్షణం’తో మళ్లీ కింద పడ్డాడు. ఆపై ‘ఏబీసీడీ’ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శిరీష్ కెరీర్ మీద అందరూ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త సినిమా ఖరారవ్వడానికి చాలా టైం పట్టింది.

చివరికి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. దీని ఫస్ట్ లుక్ రిలీజై ఏడాది దాటింది. ఇప్పటిదాకా కొత్త అప్‌డేట్ లేదు. అసలీ సినిమా పూర్తయిందా, రిలీజవుతుందా అనే విషయాల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా శిరీష్ ముందులా యాక్టివ్‌గా ఉండట్లేదు. తన సినిమా అప్‌డేట్ ఇవ్వట్లేదు. అందరూ కలిసి శిరీష్‌ను ఇలా వదిలేశారేంటా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

This post was last modified on June 13, 2022 9:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

5 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

6 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

7 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

7 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

7 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

8 hours ago