మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్లోకి అరంగేట్రం చేశారు. అందులో చాలామంది హీరోలుగా పెద్ద రేంజికి వెళ్లారు. కొందరు మీడియం రేంజి హీరోలుగా కొనసాగుతున్నారు. చివరగా ఈ కుటుంబం నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ కూడా అరంగేట్రంలోనే ‘ఉప్పెన’ లాంటి బ్లాక్బస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమా ‘కొండపొలం’తో తన అభిరుచిని చాటుకున్నాడు.
ఇప్పుడు అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఐతే పదేళ్ల కిందటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం కెరీర్లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు లేవు. చివరగా ‘ఏబీసీడీ’ లాంటి ఫ్లాప్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు శిరీష్.
మామూలుగా పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చే హీరోలను ఎలాగోలా పైకి తేవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. విరామం లేకుండా సినిమాలు చేయిస్తారు. కాస్త పేరున్న దర్శకులను ఎంచుకుంటారు. కానీ మంచి బిజినెస్మ్యాన్ అయిన అల్లు అరవింద్ మాత్రం తన చిన్న కొడుకు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదని మొదట్నుంచి అనిపిస్తూనే ఉంది.
సొంత బేనర్లో అతడితో చిన్న బడ్జెట్లలో ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేశారాయన. ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ కెరీర్కు కొంచెం ఊపు వచ్చినట్లు కనిపించినా.. ‘ఒక్కక్షణం’తో మళ్లీ కింద పడ్డాడు. ఆపై ‘ఏబీసీడీ’ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శిరీష్ కెరీర్ మీద అందరూ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త సినిమా ఖరారవ్వడానికి చాలా టైం పట్టింది.
చివరికి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. దీని ఫస్ట్ లుక్ రిలీజై ఏడాది దాటింది. ఇప్పటిదాకా కొత్త అప్డేట్ లేదు. అసలీ సినిమా పూర్తయిందా, రిలీజవుతుందా అనే విషయాల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా శిరీష్ ముందులా యాక్టివ్గా ఉండట్లేదు. తన సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. అందరూ కలిసి శిరీష్ను ఇలా వదిలేశారేంటా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
This post was last modified on June 13, 2022 9:33 am
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…