మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్లోకి అరంగేట్రం చేశారు. అందులో చాలామంది హీరోలుగా పెద్ద రేంజికి వెళ్లారు. కొందరు మీడియం రేంజి హీరోలుగా కొనసాగుతున్నారు. చివరగా ఈ కుటుంబం నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ కూడా అరంగేట్రంలోనే ‘ఉప్పెన’ లాంటి బ్లాక్బస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమా ‘కొండపొలం’తో తన అభిరుచిని చాటుకున్నాడు.
ఇప్పుడు అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఐతే పదేళ్ల కిందటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం కెరీర్లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు లేవు. చివరగా ‘ఏబీసీడీ’ లాంటి ఫ్లాప్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు శిరీష్.
మామూలుగా పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చే హీరోలను ఎలాగోలా పైకి తేవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. విరామం లేకుండా సినిమాలు చేయిస్తారు. కాస్త పేరున్న దర్శకులను ఎంచుకుంటారు. కానీ మంచి బిజినెస్మ్యాన్ అయిన అల్లు అరవింద్ మాత్రం తన చిన్న కొడుకు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదని మొదట్నుంచి అనిపిస్తూనే ఉంది.
సొంత బేనర్లో అతడితో చిన్న బడ్జెట్లలో ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేశారాయన. ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ కెరీర్కు కొంచెం ఊపు వచ్చినట్లు కనిపించినా.. ‘ఒక్కక్షణం’తో మళ్లీ కింద పడ్డాడు. ఆపై ‘ఏబీసీడీ’ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శిరీష్ కెరీర్ మీద అందరూ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త సినిమా ఖరారవ్వడానికి చాలా టైం పట్టింది.
చివరికి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. దీని ఫస్ట్ లుక్ రిలీజై ఏడాది దాటింది. ఇప్పటిదాకా కొత్త అప్డేట్ లేదు. అసలీ సినిమా పూర్తయిందా, రిలీజవుతుందా అనే విషయాల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా శిరీష్ ముందులా యాక్టివ్గా ఉండట్లేదు. తన సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. అందరూ కలిసి శిరీష్ను ఇలా వదిలేశారేంటా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
This post was last modified on June 13, 2022 9:33 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…