మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్లోకి అరంగేట్రం చేశారు. అందులో చాలామంది హీరోలుగా పెద్ద రేంజికి వెళ్లారు. కొందరు మీడియం రేంజి హీరోలుగా కొనసాగుతున్నారు. చివరగా ఈ కుటుంబం నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ కూడా అరంగేట్రంలోనే ‘ఉప్పెన’ లాంటి బ్లాక్బస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో సినిమా ‘కొండపొలం’తో తన అభిరుచిని చాటుకున్నాడు.
ఇప్పుడు అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఐతే పదేళ్ల కిందటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం కెరీర్లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు లేవు. చివరగా ‘ఏబీసీడీ’ లాంటి ఫ్లాప్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు శిరీష్.
మామూలుగా పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చే హీరోలను ఎలాగోలా పైకి తేవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. విరామం లేకుండా సినిమాలు చేయిస్తారు. కాస్త పేరున్న దర్శకులను ఎంచుకుంటారు. కానీ మంచి బిజినెస్మ్యాన్ అయిన అల్లు అరవింద్ మాత్రం తన చిన్న కొడుకు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదని మొదట్నుంచి అనిపిస్తూనే ఉంది.
సొంత బేనర్లో అతడితో చిన్న బడ్జెట్లలో ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేశారాయన. ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ కెరీర్కు కొంచెం ఊపు వచ్చినట్లు కనిపించినా.. ‘ఒక్కక్షణం’తో మళ్లీ కింద పడ్డాడు. ఆపై ‘ఏబీసీడీ’ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శిరీష్ కెరీర్ మీద అందరూ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త సినిమా ఖరారవ్వడానికి చాలా టైం పట్టింది.
చివరికి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. దీని ఫస్ట్ లుక్ రిలీజై ఏడాది దాటింది. ఇప్పటిదాకా కొత్త అప్డేట్ లేదు. అసలీ సినిమా పూర్తయిందా, రిలీజవుతుందా అనే విషయాల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా శిరీష్ ముందులా యాక్టివ్గా ఉండట్లేదు. తన సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. అందరూ కలిసి శిరీష్ను ఇలా వదిలేశారేంటా అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
This post was last modified on June 13, 2022 9:33 am
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…