2017లో వచ్చిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదా ఎప్పటికీ చెప్పుకునే కల్ట్ క్లాసిక్. తమిళనాడులో బాహుబలి రికార్డులకే ఎసరు పెట్టిందంటే ఇది ఏ స్థాయి హిట్టో చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతికి అంతులేని స్టార్ డం వచ్చింది దీని వల్లే. మాధవన్ సెకండ్ ఇన్నింగ్స్, జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కెరీర్ కు బలంగా పునాది వేసుకోవడానికి దోహదం చేసింది కూడా ఈ మూవీనే. అప్పటిదాకా పెద్దగా గుర్తింపు లేని దర్శక దంపతులు పుష్కర్ గాయత్రిలు ఒక్కసారిగా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది ఇది చేసిన మేజిక్ ఫలితంగానే.
ఇంతటి చరిత్ర ఉన్న విక్రమ్ వేదాని తెలుగులో రీమేక్ చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. రవితేజ రానా వెంకటేష్ ఇలా ఏవేవో కాంబినేషన్లు అనుకుని చివరికి అటకెక్కించారు. కట్ చేస్తే బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ని చకచకా పూర్తి చేసేశారు. గాయత్రి పుష్కర్ లే బాధ్యతలు తీసుకుని హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే లాంటి క్యాస్టింగ్ ని పెట్టుకుని కేవలం నెలల వ్యవధిలోనే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి గుమ్మడికాయ కొట్టేసి ఈ రోజు సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటిదాకా తమిళ వెర్షన్ చూడని మన జనాలు చాలానే ఉన్నారు. ఇప్పుడీ హిందీ విక్రమ్ వేదా వచ్చేస్తే అందులో అధిక శాతం దీన్ని చూసేస్తారు. అప్పుడిక మనవాళ్ళు తీయాలన్న ఆలోచన విరమించుకోవడం మంచిదవుతుంది. చిన్నది పెద్దది అనే తేడా లేకుండా తమిళ మలయాళంలో ఏదైనా మినిమమ్ హిట్ అయితే చాలు రీమేకుల కోసం పరుగులు పెట్టే మన దర్శక నిర్మాతలు విక్రమ్ వేదా వచ్చి అయిదేళ్ళు దాటుతున్నా దాన్నలా వదిలేయడం విచిత్రమే.
This post was last modified on June 10, 2022 8:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…