Movie News

‘పుష్ప 2’ సంక్రాంతికేనా ?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప ది రైజ్’ కి సీక్వెల్ గా రానున్న ‘పుష్ప ది రూల్ ‘ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది. జులై చివర్లో లేదా ఆగస్ట్ లో ఈ సీక్వెల్ తో బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. హైదరాబాద్ , చెన్నై , కేరళ లతో పాటు చిత్తూరు జిల్లా , మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని షెడ్యుల్స్ రెడీ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లో ఓ సాంగ్ షూట్ చేసి తర్వాత మారేడుమిల్లిలో ఓ షెడ్యుల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ సీక్వెల్ రిలీజ్ కి సంబంధించి పుష్ప రిలీజ్ టైంలో బన్నీ ఓ డేట్ చెప్పాడు. పుష్ప రిలీజైన డిసెంబర్ లోనే పుష్ప 2 కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. కానీ ఇప్పుడు డిసెంబర్ కాకుండా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. డిసెంబర్ లోనే పుష్ప భారీ వసూళ్ళు అందుకుంది. అదే సంక్రాంతి సీజన్ అయితే ఇంకా గట్టిగా కలెక్షన్స్ రాబట్టేది. కానీ అప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం డిసెంబర్ కి షిఫ్ట్ చేసుకున్నారు.

ఇక తాజాగా జరిగిన షెడ్యుల్ డిస్కషన్స్ లో ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఓ మాట అనుకున్నారని సమాచారం. సుకుమార్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రాజమౌళి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో షూటింగ్ కి ఎక్కువ డేస్ తీసుకునేది సుక్కునే. మరి నిర్మాతలు చెప్పిన టైంకి సుక్కు ఈ సీక్వెల్ ని కంప్లీట్ చేసి భారీ అంచనాలను అందుకోవడం అంటే కష్టమే. ప్రస్తుతానికయితే మేకర్స్ సంక్రాంతి రిలీజ్ కే ఫిక్సయ్యారు.

Satya

Recent Posts

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

14 minutes ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

18 minutes ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

33 minutes ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

1 hour ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

2 hours ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

2 hours ago