ప్రస్తుతం యంగ్ దర్శకులు డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ హీరోగా టర్న్ అయ్యి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాగే విశ్వక్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశారు తరుణ్. ఇప్పుడు కోవలో మరో దర్శకుడు చేరాడు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా నటుడిగా మారాడు. మొన్నీ మధ్యే సత్య దేవ్ తో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు వెంకటేష్. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ లో ఏదో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. అలాగే ఓ వెబ్ సిరీస్ ఆఫర్ కూడా వెంకటేష్ చేతిలో ఉంది. కానీ ఏది సెట్స్ పైకి వెళ్ళడం లేదు. అందుకే యాక్టర్ గా టర్న్ తీసుకున్నాడు.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘అంటే సుందరానికీ’ సినిమాలో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకునే కుర్రాడిగా కనిపించాడు వెంకటేష్ మహా. అది కూడా గెస్ట్ అప్పిరియన్స్ కాదు. నాలుగైదు సన్నివేశాలున్న పాత్రే. నిజానికి వివేక్ , వెంకటేష్ మహా ఒకేసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పైగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అందుకే వివేక్ సినిమాలో ఓ కీ రోల్ ని వెంకటేష్ మహా తో చేయించి నటుడిగా మార్చాడు.
ఇక మొదటి సినిమా టైంకి కాస్త మోటుగా కనిపించిన వెంకటేష్ మహా ఇప్పుడు స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. బహుశా ఆ లుక్ చూసే వివేక్ తనకి ఈ పాత్ర ఇవ్వాలని అనుకున్నాడెమో. ఏదేమైనా దర్శకుడు నటుడిగా మారితే కొన్ని అడ్వాంటేజ్ లు ఉంటాయి. దర్శకుడికి ఏం కావాలి అది పక్కాగా డెలివరీ చేస్తారు. డైరెక్టర్స్ లో కాస్త ఈజ్ ఉంటే ఎలాంటి పాత్రైనా చేసేయొచ్చు. మరి వెంకటేష్ మహా ఇకపై నటుడిగా కంటిన్యూ అవుతాడా లేదా దర్శకుడిగా సినిమాలు చేసుకుంటాడా చూడాలి.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…