Movie News

‘అంటే’ ఆ లిస్టులో చేరుతుందా ?

మరికొన్ని గంటల్లో నాని నటించిన ‘అంటే సుందరనికీ’ థియేటర్స్ లోకి రాబోతుంది. టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ అనిపించుకున్నాయి. సినిమాలో కూడా కంటెంట్ ఉందని నాని మళ్ళీ సీట్లో కూర్చుబెట్టి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. దర్శకుడు కూడా టాలెంటెడే. బ్రోచేవారెవరురా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇలా ఎటు చూసిన అంటే కి అంతా పాజిటివ్ గానే ఉంది. కానీ ఒక్కటే సమస్య ఉంది. అదే నిడివి.

అవును సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. రెండు గంటల యాబై సెకన్ల పైనే రన్ టైం లాక్ చేసుకున్నారు. ఇటివలే దర్శకుడు , అలాగే హీరో నాని ఇద్దరూ తమకి రన్ టైం ప్రాబ్లెం లేదని సినిమా చూశాక ఇంత సేపు అంత సేపు అనే డిస్కషన్ ఉండదని గట్టిగానే చెప్తున్నారు. పైగా మైత్రి మూవీ మేకర్స్ కి ఎక్కువ నిడివితో ఉన్న సినిమాలు మంచి విజయాలు అందించాయి. అది కూడా ఓ సెంటిమెంట్ అనుకోవచ్చు.

ఏదేమైనా రం టైం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయింది. రెండున్నర గంటలే ప్రేక్షకులకు థియేటర్స్ లో బోర్ కొట్టేస్తుంది. మధ్య మధ్యలో సెల్ ఫోన్స్ పట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’,’మహానటి’,’రంగస్థలం’ ఇలా కొన్ని క్లాసిక్ హిట్స్ మాత్రమే రన్ టైం ఎక్కువ అన్న మాటే లేకుండా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. మరి ‘అంటే సుందరానికీ’ కూడా అదే కోవలోకి వస్తుందా ? చూడాలి. ఈ ఒక్క సమస్యను అధిగమించి సినిమా ఎంటర్టైన్ చేస్తే మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం.

This post was last modified on June 10, 2022 7:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వర్మ శారీ…..ఆడియన్స్ సారీ

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…

4 hours ago

ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్ బాబు

టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…

7 hours ago

విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…

8 hours ago

పీ-4కు స్పంద‌న‌.. 10 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్‌షిప్‌)కు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల నుంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజంలోని పేద‌ల‌ను ఆదుకుని..…

8 hours ago

పిఠాప‌రంలో రాజకీయాల కోసం రాలేదట

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు రెండో రోజు శ‌నివారం కూడా.. పిఠాపురంలో ప‌ర్య‌టించారు. శుక్ర‌వారం పిఠాపురానికి వెళ్లిన ఆయ‌న‌..…

8 hours ago

ఏపీ vs తెలంగాణ‌.. ముదురుతున్న నీటి యుద్ధం!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేస‌వి కాలం ప్రారంభం అయిన నేప‌థ్యంలో సాగు, తాగు నీటి…

9 hours ago