మరికొన్ని గంటల్లో నాని నటించిన ‘అంటే సుందరనికీ’ థియేటర్స్ లోకి రాబోతుంది. టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ అనిపించుకున్నాయి. సినిమాలో కూడా కంటెంట్ ఉందని నాని మళ్ళీ సీట్లో కూర్చుబెట్టి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. దర్శకుడు కూడా టాలెంటెడే. బ్రోచేవారెవరురా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇలా ఎటు చూసిన అంటే కి అంతా పాజిటివ్ గానే ఉంది. కానీ ఒక్కటే సమస్య ఉంది. అదే నిడివి.
అవును సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. రెండు గంటల యాబై సెకన్ల పైనే రన్ టైం లాక్ చేసుకున్నారు. ఇటివలే దర్శకుడు , అలాగే హీరో నాని ఇద్దరూ తమకి రన్ టైం ప్రాబ్లెం లేదని సినిమా చూశాక ఇంత సేపు అంత సేపు అనే డిస్కషన్ ఉండదని గట్టిగానే చెప్తున్నారు. పైగా మైత్రి మూవీ మేకర్స్ కి ఎక్కువ నిడివితో ఉన్న సినిమాలు మంచి విజయాలు అందించాయి. అది కూడా ఓ సెంటిమెంట్ అనుకోవచ్చు.
ఏదేమైనా రం టైం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయింది. రెండున్నర గంటలే ప్రేక్షకులకు థియేటర్స్ లో బోర్ కొట్టేస్తుంది. మధ్య మధ్యలో సెల్ ఫోన్స్ పట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’,’మహానటి’,’రంగస్థలం’ ఇలా కొన్ని క్లాసిక్ హిట్స్ మాత్రమే రన్ టైం ఎక్కువ అన్న మాటే లేకుండా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. మరి ‘అంటే సుందరానికీ’ కూడా అదే కోవలోకి వస్తుందా ? చూడాలి. ఈ ఒక్క సమస్యను అధిగమించి సినిమా ఎంటర్టైన్ చేస్తే మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం.
This post was last modified on June 10, 2022 7:05 am
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…