లాక్ డౌన్ ఎత్తివేయాలని, షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున పెద్ద దిక్కుగా వెళ్లిన చిరంజీవి అదే ఊపులో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆచార్య మొదలు కాలేదు. షూటింగ్ పునఃప్రారంభించి సంక్రాంతికి విడుదల అయ్యేలా చూసుకోవాలనేది అసలు ప్లాన్. కానీ ఇప్పుడా అవకాశం లేదు.
సంక్రాంతికి ఆచార్య రావడం అసాధ్యం. ఆల్రెడీ వచ్చే వేసవికి విడుదల చేసుకుందామని ఇంటర్నల్ గా డిసైడ్ అయినట్టు సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని తొలుత భావించినా కానీ ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలిసింది.
సంక్రాంతికి వేరే పెద్ద సినిమాలు ఏవీ ఉండవు కనుక, వకీల్ సాబ్ కి ఇంకా ముప్పై రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో షూటింగ్ అక్టోబర్ లో జరిగినా కానీ సంక్రాంతికి హ్యాపీగా రావొచ్చు అని, తనకు సంక్రాంతి బాగా కలిసి వచ్చిన సీజన్ కనుక సెంటిమెంట్ గా కూడా దిల్ రాజు అదే డేట్ కి ఫిక్స్ అయ్యారని సమాచారం.
This post was last modified on June 27, 2020 2:09 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…