లాక్ డౌన్ ఎత్తివేయాలని, షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున పెద్ద దిక్కుగా వెళ్లిన చిరంజీవి అదే ఊపులో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆచార్య మొదలు కాలేదు. షూటింగ్ పునఃప్రారంభించి సంక్రాంతికి విడుదల అయ్యేలా చూసుకోవాలనేది అసలు ప్లాన్. కానీ ఇప్పుడా అవకాశం లేదు.
సంక్రాంతికి ఆచార్య రావడం అసాధ్యం. ఆల్రెడీ వచ్చే వేసవికి విడుదల చేసుకుందామని ఇంటర్నల్ గా డిసైడ్ అయినట్టు సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని తొలుత భావించినా కానీ ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలిసింది.
సంక్రాంతికి వేరే పెద్ద సినిమాలు ఏవీ ఉండవు కనుక, వకీల్ సాబ్ కి ఇంకా ముప్పై రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో షూటింగ్ అక్టోబర్ లో జరిగినా కానీ సంక్రాంతికి హ్యాపీగా రావొచ్చు అని, తనకు సంక్రాంతి బాగా కలిసి వచ్చిన సీజన్ కనుక సెంటిమెంట్ గా కూడా దిల్ రాజు అదే డేట్ కి ఫిక్స్ అయ్యారని సమాచారం.
This post was last modified on June 27, 2020 2:09 am
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…