కొన్నేళ్ల కిందట ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మహానుభావుడు లాంటి చిత్రాలతో కెరీర్ను మరో లెవెల్కు తీసుకెళ్తున్నట్లుగా కనిపించాడు యువ కథానాయకుడు శర్వానంద్. కానీ ఆ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక.. అతడి కెరీర్ గాడి తప్పింది. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తాయనుకున్న పడి పడి లేచె మనసు, మహాసముద్రం లాంటి సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా మిగలడంతో శర్వా మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
ఈ మధ్య ఆడవాళ్ళు మీకు జోహార్లు పర్వాలేదనే టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా నిలవడానికి శర్వా మార్కెట్ దెబ్బ తినడమే కారణం. ఇప్పుడు అతడి కెరీర్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ఇలాంటి టైంలో కొంచెం గ్యాప్ తీసుకుని ఆచితూచి ఓ సినిమా చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. లిరిసిస్ట్ కృష్ణచైతన్య.. శర్వా కొత్త సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇంతకుముందే వెల్లడైన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి కొన్ని రోజులుగా కథానాయికల వేట సాగుతోంది. రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. చివరికి రాశి ఖన్నా, ప్రియమణిలను ఖరారు చేసినట్లు సమాచారం. రాశి ఖన్నాది శర్వాకు జోడీగా కనిపించే పాత్రే కానీ.. ప్రియమణిది ఆ టైపు కాదని తెలుస్తోంది. ఆమెది ప్రత్యేక పాత్ర అంటున్నారు. రాశికి కూడా టాలీవుడ్లో ఈ మధ్య కెరీర్ ఏమంత బాగా లేదు.
కొత్త రిలీజ్లు పక్కా కమర్షియల్, థ్యాంక్ యు రిలీజ్ కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఇలాంటి టైంలో కాస్త రిస్క్లా అనిపిస్తున్న ప్రాజెక్టును ఆమె ఓకే చేసింది. శర్వాతో ఆమె తొలి చిత్రం ఇదే. ఈ సినిమాలో ప్రియమణి నటించడం కూడా ఆసక్తికరమే.
This post was last modified on June 7, 2022 6:46 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…