ఆహా ఓటీటీ ని ఉన్నపళంగా జనాలకి బాగా దగ్గర చేసి భారీ సబ్ స్క్రైబర్స్ రాబట్టిన షో ‘అన్ స్టాపబుల్’. నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఓ టాక్ షో హోస్ట్ చేయడం , పైగా స్టార్ హీరోలతో ఎపిసోడ్స్ చేసి వారి నుండి పాత సంగతులు, కొత్త విషయాలు రాబట్టడంతో అన్ స్టాపబుల్ ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిజానికి డబ్బింగ్ సినిమాలతో ‘ఆహా’ రాబట్టలేకపోయిన కొత్త సబ్ స్క్రైబర్స్ తెచ్చిపెట్టిన ఏకైక షో ఇదే.
ఇంతటి సక్సెస్ సాధించిన ఈ షోని వెంటనే సీజన్ 2 గా కంటిన్యూ చేయాలి కానీ ఆహా టీం మాత్రం ఇంకా ప్లానింగ్ లోనే ఉన్నారు. సీజన్ 2 కూడా బాలయ్యతోనే చేయిస్తారని తెలుస్తుంది. బాలయ్య కూడా రెండో సీజన్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు ఆహా.
మొదటి సీజన్ సక్సెస్ అవ్వగానే రెండో సీజన్ కి ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా గ్యాప్ ఇస్తే బాలయ్య షో కోసం వచ్చిన వ్యూవర్స్ మెల్లగా అన్ సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. తాజాగా ‘ఆహా’ సబ్ స్క్రైబర్స్ కౌంట్ తగ్గిందని తెలుస్తుంది. అందుకే రేటు కూడా తగ్గించి మళ్ళీ ప్రమోషన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాం కొత్త సినిమాలతో ముందుకు నడుస్తుంది తప్ప కొత్త సబ్ స్క్రైబర్స్ ని పొందాలంటే మాత్రం మళ్ళీ బాలయ్య షో అలాగే మరిన్ని షోలు స్టార్ట్ చేయాల్సి ఉంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…