ఆహా ఓటీటీ ని ఉన్నపళంగా జనాలకి బాగా దగ్గర చేసి భారీ సబ్ స్క్రైబర్స్ రాబట్టిన షో ‘అన్ స్టాపబుల్’. నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఓ టాక్ షో హోస్ట్ చేయడం , పైగా స్టార్ హీరోలతో ఎపిసోడ్స్ చేసి వారి నుండి పాత సంగతులు, కొత్త విషయాలు రాబట్టడంతో అన్ స్టాపబుల్ ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిజానికి డబ్బింగ్ సినిమాలతో ‘ఆహా’ రాబట్టలేకపోయిన కొత్త సబ్ స్క్రైబర్స్ తెచ్చిపెట్టిన ఏకైక షో ఇదే.
ఇంతటి సక్సెస్ సాధించిన ఈ షోని వెంటనే సీజన్ 2 గా కంటిన్యూ చేయాలి కానీ ఆహా టీం మాత్రం ఇంకా ప్లానింగ్ లోనే ఉన్నారు. సీజన్ 2 కూడా బాలయ్యతోనే చేయిస్తారని తెలుస్తుంది. బాలయ్య కూడా రెండో సీజన్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు ఆహా.
మొదటి సీజన్ సక్సెస్ అవ్వగానే రెండో సీజన్ కి ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా గ్యాప్ ఇస్తే బాలయ్య షో కోసం వచ్చిన వ్యూవర్స్ మెల్లగా అన్ సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. తాజాగా ‘ఆహా’ సబ్ స్క్రైబర్స్ కౌంట్ తగ్గిందని తెలుస్తుంది. అందుకే రేటు కూడా తగ్గించి మళ్ళీ ప్రమోషన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాం కొత్త సినిమాలతో ముందుకు నడుస్తుంది తప్ప కొత్త సబ్ స్క్రైబర్స్ ని పొందాలంటే మాత్రం మళ్ళీ బాలయ్య షో అలాగే మరిన్ని షోలు స్టార్ట్ చేయాల్సి ఉంది.
This post was last modified on June 6, 2022 5:06 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…