‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ కి ముందు నాని ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటుపై స్పందిస్తూ ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వైఎస్ ఆర్ సి పీ పార్టీ నాయకులు నానిని గట్టిగా త్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి సినిమా రేటు పై కామెంట్ చేశాడు నాని. అప్పుడు టికెటు రేటు పెంచమన్నావ్ ఇప్పుడు బాగా పెరిగాయి బాగుందా ? అంటూ సోషల్ మీడియాలో తనని కొందరు ట్యాగ్ చేశారని నిజానికి సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎవరో ఒకరి ఒపినియన్ తీసుకొని దాన్నే మళ్ళీ కాపీ చేస్తూ పెట్టుకుంటారని అసలు మేటర్ అర్థం చేసుకోరని అన్నాడు.
అప్పట్లో నేను అడిగినప్పుడు మరీ ముప్పై , నలబై , యాబై రేటు ఉందని ఆ రేటుతో సినిమా వాళ్ళకి నష్టమని దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ రేటుకి లింక్ చేసి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, అప్పుడు అది తప్పైతే ఇప్పుడు ఇది కూడా తప్పే అని ఇంత రేటు కూడా ఉండకూడదని మీడియం రేట్లతో థియేటర్స్ కొనసాగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. RRR లాంటి సినిమాలకు ఈ రేటు ఓకె కానీ మిగతా సినిమాలకు ఈ రేటు అస్సలు కరెక్ట్ కాదని అన్నాడు.
ఇక మొన్నీ మధ్య హీరో నాని గురించి రెండు వార్తలు వినిపించాయి. విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమాలో నాని స్పెషల్ రోల్ అనేది అందులో ఒక వార్త కాగా మరొకటి మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో నాని ఓ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడనేది ఇంకో వార్త. ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో పుట్టినవే. తర్వాత మీడియాలో కథనాలుగా మారాయి.
ఈ సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు నాని. ఆ సినిమాల్లో తను నటించడం లేదని అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు. తనకి కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ వార్తలు కనిపించాయని చెప్పుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే తన సినిమా ఎనౌన్స్ చేసినా రూమర్ అనుకుంటారేమో అంటూ జోకేశాడు. తాజాగా అంటే సుందరానికి మీడియా మీట్ లో నాని ఆ కేరెక్టర్స్ పై ఇలా తన దైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…