‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ కి ముందు నాని ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటుపై స్పందిస్తూ ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వైఎస్ ఆర్ సి పీ పార్టీ నాయకులు నానిని గట్టిగా త్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి సినిమా రేటు పై కామెంట్ చేశాడు నాని. అప్పుడు టికెటు రేటు పెంచమన్నావ్ ఇప్పుడు బాగా పెరిగాయి బాగుందా ? అంటూ సోషల్ మీడియాలో తనని కొందరు ట్యాగ్ చేశారని నిజానికి సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎవరో ఒకరి ఒపినియన్ తీసుకొని దాన్నే మళ్ళీ కాపీ చేస్తూ పెట్టుకుంటారని అసలు మేటర్ అర్థం చేసుకోరని అన్నాడు.
అప్పట్లో నేను అడిగినప్పుడు మరీ ముప్పై , నలబై , యాబై రేటు ఉందని ఆ రేటుతో సినిమా వాళ్ళకి నష్టమని దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ రేటుకి లింక్ చేసి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, అప్పుడు అది తప్పైతే ఇప్పుడు ఇది కూడా తప్పే అని ఇంత రేటు కూడా ఉండకూడదని మీడియం రేట్లతో థియేటర్స్ కొనసాగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. RRR లాంటి సినిమాలకు ఈ రేటు ఓకె కానీ మిగతా సినిమాలకు ఈ రేటు అస్సలు కరెక్ట్ కాదని అన్నాడు.
ఇక మొన్నీ మధ్య హీరో నాని గురించి రెండు వార్తలు వినిపించాయి. విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమాలో నాని స్పెషల్ రోల్ అనేది అందులో ఒక వార్త కాగా మరొకటి మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో నాని ఓ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడనేది ఇంకో వార్త. ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో పుట్టినవే. తర్వాత మీడియాలో కథనాలుగా మారాయి.
ఈ సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు నాని. ఆ సినిమాల్లో తను నటించడం లేదని అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు. తనకి కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ వార్తలు కనిపించాయని చెప్పుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే తన సినిమా ఎనౌన్స్ చేసినా రూమర్ అనుకుంటారేమో అంటూ జోకేశాడు. తాజాగా అంటే సుందరానికి మీడియా మీట్ లో నాని ఆ కేరెక్టర్స్ పై ఇలా తన దైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on June 6, 2022 3:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…