‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ కి ముందు నాని ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటుపై స్పందిస్తూ ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వైఎస్ ఆర్ సి పీ పార్టీ నాయకులు నానిని గట్టిగా త్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి సినిమా రేటు పై కామెంట్ చేశాడు నాని. అప్పుడు టికెటు రేటు పెంచమన్నావ్ ఇప్పుడు బాగా పెరిగాయి బాగుందా ? అంటూ సోషల్ మీడియాలో తనని కొందరు ట్యాగ్ చేశారని నిజానికి సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎవరో ఒకరి ఒపినియన్ తీసుకొని దాన్నే మళ్ళీ కాపీ చేస్తూ పెట్టుకుంటారని అసలు మేటర్ అర్థం చేసుకోరని అన్నాడు.
అప్పట్లో నేను అడిగినప్పుడు మరీ ముప్పై , నలబై , యాబై రేటు ఉందని ఆ రేటుతో సినిమా వాళ్ళకి నష్టమని దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ రేటుకి లింక్ చేసి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, అప్పుడు అది తప్పైతే ఇప్పుడు ఇది కూడా తప్పే అని ఇంత రేటు కూడా ఉండకూడదని మీడియం రేట్లతో థియేటర్స్ కొనసాగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. RRR లాంటి సినిమాలకు ఈ రేటు ఓకె కానీ మిగతా సినిమాలకు ఈ రేటు అస్సలు కరెక్ట్ కాదని అన్నాడు.
ఇక మొన్నీ మధ్య హీరో నాని గురించి రెండు వార్తలు వినిపించాయి. విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమాలో నాని స్పెషల్ రోల్ అనేది అందులో ఒక వార్త కాగా మరొకటి మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో నాని ఓ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడనేది ఇంకో వార్త. ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో పుట్టినవే. తర్వాత మీడియాలో కథనాలుగా మారాయి.
ఈ సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు నాని. ఆ సినిమాల్లో తను నటించడం లేదని అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు. తనకి కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ వార్తలు కనిపించాయని చెప్పుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే తన సినిమా ఎనౌన్స్ చేసినా రూమర్ అనుకుంటారేమో అంటూ జోకేశాడు. తాజాగా అంటే సుందరానికి మీడియా మీట్ లో నాని ఆ కేరెక్టర్స్ పై ఇలా తన దైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on June 6, 2022 3:56 pm
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…