పృథ్వీరాజ్.. బాలీవుడ్లో తెరకెక్కిన మరో భారీ చిత్రం. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్లో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన చిత్రమిది. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయికగా పరిచయం అయిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూ సూద్ ముఖ్య పాత్రలు పోషించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ తరహాలో చారిత్రక కథకు భారీ తారాగణం, సెట్టింగ్స్ జోడించి ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో తీర్చిదిద్దారు.
ఐతే ఒకప్పుడైతే ఈ సినిమా బాగా ఆడేదేమో కానీ.. బాలీవుడ్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ, ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్న బ్యాడ్ టైమింగ్లో రిలీజ్ కావడం ప్రతికూలంగా మారినట్లుంది. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే తుస్సుమనిపించిన ‘పృథ్వీరాజ్’.. రిలీజ్ తర్వాత కూడా పుంజుకోలేకపోయింది. సినిమాకు మరీ గొప్ప టాక్ రాలేదు. అలాగని తీసిపడేసేలా లేదు. దీనికి తగ్గట్లే వసూళ్లు కూడా ఉన్నాయి.
తొలి రోజు రూ.10.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ‘పృథ్వీరాజ్’.. రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు తెచ్చుకుంది. మామూలుగా చూస్తే ఇవి డీసెంట్ కలెక్షన్లు అనుకోవాలి. కానీ అక్షయ్ కుమార్ హీరో, ఇంత భారీతనం ఉన్న సినిమాకు ఈ వసూళ్లు సరిపోవు. దీని మీద నిర్మాతలు, బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి, వస్తున్న వసూళ్లకు పొంతన లేదు. వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు వస్తే తప్ప ఇది బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ వీకెండ్లోనే అంతంతమాత్రంగా ఉన్న వసూళ్లు.. తర్వాత పుంజుకుంటాయనే ఆశ కనిపించడం లేదు.
సోమవారం నుంచి వసూళ్లలో మేజర్ డ్రాప్ ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ సినిమా ఎపిక్ డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది బాలీవుడ్ పెద్ద హీరోలు నటించిన హిందీ చిత్రాలను అక్కడి ప్రేక్షకులు వరుసగా ఇలా తిరస్కరిస్తుండటం అక్కడి ఇండస్ట్రీ జనాలను బెంబేలెత్తిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో అన్న భయాన్ని పెంచుతోంది. ఓవైపు సౌత్ సినిమాలు మేజర్, విక్రమ్ అదరగొడుతుండగా.. ‘పృథ్వీరాజ్’కు ఇలాంటి పరిస్థితి రావడం వారికి విస్మయాన్ని కలిగిస్తోంది.
This post was last modified on June 5, 2022 7:41 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…