రెండు దశాబ్దాల కిందట ఒకేసారి తొమ్మిది సినిమాల ఓపెనింగ్తో సంచలనం రేపిన నటుడు నందమూరి తారకరత్న. కానీ అలా ప్రారంభించిన తొమ్మిది సినిమాల్లో కొన్ని మొదలే కాలేదు. కొన్ని పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. రిలీజైనవి ఏవీ ఆడలేదు. ఆ తర్వాత తారకరత్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏవీ ఫలితాన్నివ్వలేదు. విలన్ పాత్రలు చేసినా కూడా నిరాశ తప్పలేదు. కొన్నేళ్ల నుంచి అసలు అతడి పేరే వినిపించలేదు.
ఐతే ఇప్పుడు ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్తో మళ్లీ ప్రేక్షకులను పలకరించాడు తారకరత్న. ఈ సందర్భంగా మీడియాను కలిసిన అతను కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు. త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర చేయబోతున్నట్లు జరిగిన ప్రచారం గురించి స్పందిస్తూ.. తన పేరిట ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి ఈ రూమర్తో అందరినీ కన్ఫ్యూజ్ చేశారని, తాను అసలు సోషల్ మీడియాలో ఎక్కడా లేనని తారకరత్న మరోసారి స్పష్టం చేశాడు. నిజంగా మహేష్ సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని అతనన్నాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్కు పోటీగానే మిమ్మల్ని నందమూరి ఫ్యామిలీ సినిమాల్లోకి తీసుకొచ్చిందా అని అడిగితే.. “తమ్ముడు ఎన్టీఆర్ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పటికే తమ్ముడికి ‘ఆది’ లాంటి సినిమాలు హిట్ వచ్చాయి. నేను తారక్కు కాంపిటీషన్ కాదు. నేను ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. అతను గ్రేట్ ఆర్టిస్ట్. మేమంతా నందమూరి బిడ్డలం. ఈరోజు నందమూరి ఫ్యామిలీ పేరు నిలబడుతోంది అంటే ఎన్టీఆర్ కూడా ఒక కారణం. ఎన్టీఆర్కు కాంపిటీషన్గా లాంచ్ చేశారనేది పూర్తిగా తప్పు. హీరో కావాలనేది నా డ్రీమ్. దానికి మా నాన్నగారు, బాబాయ్ సపోర్ట్ చేసి ఒకే అన్నారు. ఎన్టీఆర్కు కాంపిటీషన్గా ఏ రోజు లేదు. అప్పటి నుంచే ఈ విషయంపై క్లారిటీ ఇద్దామని అనుకున్నా. 2002 నుంచే ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. తమ్ముడు నాకు ఎప్పుడు కాంపిటీషన్ అని ఫీల్ అవ్వలేదు. ఎవరు ముందుకు వెళ్లినా.. నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళుతుంది. తమ్ముడు ఎన్టీఆర్ తీసుకువెళ్లినా.. అన్న కళ్యాణ్ రామ్ తీసుకువెళ్లినా నాకు సంతోషమే. అందుకే ఏరోజు కూడా నేను పోటీగా భావించలేదు” అని తారకరత్న స్పష్టం చేశాడు.
This post was last modified on June 5, 2022 2:20 pm
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…