రెండు దశాబ్దాల కిందట ఒకేసారి తొమ్మిది సినిమాల ఓపెనింగ్తో సంచలనం రేపిన నటుడు నందమూరి తారకరత్న. కానీ అలా ప్రారంభించిన తొమ్మిది సినిమాల్లో కొన్ని మొదలే కాలేదు. కొన్ని పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. రిలీజైనవి ఏవీ ఆడలేదు. ఆ తర్వాత తారకరత్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏవీ ఫలితాన్నివ్వలేదు. విలన్ పాత్రలు చేసినా కూడా నిరాశ తప్పలేదు. కొన్నేళ్ల నుంచి అసలు అతడి పేరే వినిపించలేదు.
ఐతే ఇప్పుడు ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్తో మళ్లీ ప్రేక్షకులను పలకరించాడు తారకరత్న. ఈ సందర్భంగా మీడియాను కలిసిన అతను కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు. త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర చేయబోతున్నట్లు జరిగిన ప్రచారం గురించి స్పందిస్తూ.. తన పేరిట ఎవరో ఫేక్ అకౌంట్ తెరిచి ఈ రూమర్తో అందరినీ కన్ఫ్యూజ్ చేశారని, తాను అసలు సోషల్ మీడియాలో ఎక్కడా లేనని తారకరత్న మరోసారి స్పష్టం చేశాడు. నిజంగా మహేష్ సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని అతనన్నాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్కు పోటీగానే మిమ్మల్ని నందమూరి ఫ్యామిలీ సినిమాల్లోకి తీసుకొచ్చిందా అని అడిగితే.. “తమ్ముడు ఎన్టీఆర్ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పటికే తమ్ముడికి ‘ఆది’ లాంటి సినిమాలు హిట్ వచ్చాయి. నేను తారక్కు కాంపిటీషన్ కాదు. నేను ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. అతను గ్రేట్ ఆర్టిస్ట్. మేమంతా నందమూరి బిడ్డలం. ఈరోజు నందమూరి ఫ్యామిలీ పేరు నిలబడుతోంది అంటే ఎన్టీఆర్ కూడా ఒక కారణం. ఎన్టీఆర్కు కాంపిటీషన్గా లాంచ్ చేశారనేది పూర్తిగా తప్పు. హీరో కావాలనేది నా డ్రీమ్. దానికి మా నాన్నగారు, బాబాయ్ సపోర్ట్ చేసి ఒకే అన్నారు. ఎన్టీఆర్కు కాంపిటీషన్గా ఏ రోజు లేదు. అప్పటి నుంచే ఈ విషయంపై క్లారిటీ ఇద్దామని అనుకున్నా. 2002 నుంచే ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. తమ్ముడు నాకు ఎప్పుడు కాంపిటీషన్ అని ఫీల్ అవ్వలేదు. ఎవరు ముందుకు వెళ్లినా.. నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళుతుంది. తమ్ముడు ఎన్టీఆర్ తీసుకువెళ్లినా.. అన్న కళ్యాణ్ రామ్ తీసుకువెళ్లినా నాకు సంతోషమే. అందుకే ఏరోజు కూడా నేను పోటీగా భావించలేదు” అని తారకరత్న స్పష్టం చేశాడు.
This post was last modified on June 5, 2022 2:20 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…