ఇంకో 13 రోజుల్లో రాబోతున్న విరాట పర్వం మీద భారీ హైప్ లేదు కానీ ఉన్నంతలో బజ్ పెంచేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే రేపు సాయంత్రం కర్నూలు వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ వదిలిన చిన్న వీడియో బైట్ లో ఒక ఫ్యాన్ తో కలిసి రానా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ గా మారాయి. అందులో ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు సాయిపల్లవి కోసమే ఈ సినిమా తీశామన్నట్టుగా రానా బదులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అంటే ఆమె పేరు చెబితేనే విరాటపర్వంకు పబ్లిసిటీ వస్తుందానే తరహాలో దగ్గుబాటి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో చెప్పుకోవడానికి బలమైన కంటెంట్ ఉంది. నందితా దాస్, ప్రియమణి లాంటి టాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల చాలా పరిశోధన చేసి అప్పటి వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. బలమైన సంగీత సాహిత్యాలను సమకూర్చుకున్నారు. ఇన్ని ఉన్నా ఒక్క అంశం మీదే ఫోకస్ పెడుతున్నారు.
నిజానికి లవ్ స్టోరీ టైంలోనూ సాయిపల్లవి బ్రాండ్ చాలా ప్లస్ అయ్యింది. బిసి సెంటర్లలో నాగచైతన్యతో పాటు ఈమెకూ కటవుట్లు బ్యానర్లు పెట్టడం, ఆ ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ కావడం అందరూ చూశారు. నిన్న వదిలిన విరాటపర్వం పోస్టర్ లోనూ సాయిపల్లవిని స్పష్టంగా చూపించి రానా మొహం మాత్రం కవర్ చేశారు. అసలే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని రిస్కీ డ్రామా ఇది. అలాంటిది ఒక పాయింట్ ని హైలైట్ చేయడం వల్ల అంచనాలు పక్కదారి పట్టే ఇబ్బంది లేకపోలేదు. మరి సురేష్ టీమ్ స్ట్రాటజీ ఏంటో.
This post was last modified on June 4, 2022 6:41 pm
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…