ఇంకో 13 రోజుల్లో రాబోతున్న విరాట పర్వం మీద భారీ హైప్ లేదు కానీ ఉన్నంతలో బజ్ పెంచేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే రేపు సాయంత్రం కర్నూలు వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ వదిలిన చిన్న వీడియో బైట్ లో ఒక ఫ్యాన్ తో కలిసి రానా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ గా మారాయి. అందులో ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు సాయిపల్లవి కోసమే ఈ సినిమా తీశామన్నట్టుగా రానా బదులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అంటే ఆమె పేరు చెబితేనే విరాటపర్వంకు పబ్లిసిటీ వస్తుందానే తరహాలో దగ్గుబాటి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో చెప్పుకోవడానికి బలమైన కంటెంట్ ఉంది. నందితా దాస్, ప్రియమణి లాంటి టాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల చాలా పరిశోధన చేసి అప్పటి వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. బలమైన సంగీత సాహిత్యాలను సమకూర్చుకున్నారు. ఇన్ని ఉన్నా ఒక్క అంశం మీదే ఫోకస్ పెడుతున్నారు.
నిజానికి లవ్ స్టోరీ టైంలోనూ సాయిపల్లవి బ్రాండ్ చాలా ప్లస్ అయ్యింది. బిసి సెంటర్లలో నాగచైతన్యతో పాటు ఈమెకూ కటవుట్లు బ్యానర్లు పెట్టడం, ఆ ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ కావడం అందరూ చూశారు. నిన్న వదిలిన విరాటపర్వం పోస్టర్ లోనూ సాయిపల్లవిని స్పష్టంగా చూపించి రానా మొహం మాత్రం కవర్ చేశారు. అసలే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని రిస్కీ డ్రామా ఇది. అలాంటిది ఒక పాయింట్ ని హైలైట్ చేయడం వల్ల అంచనాలు పక్కదారి పట్టే ఇబ్బంది లేకపోలేదు. మరి సురేష్ టీమ్ స్ట్రాటజీ ఏంటో.
This post was last modified on June 4, 2022 6:41 pm
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…
తమిళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును టీవీకే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ……