ఒకప్పుడు తమిళ సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు ఉండేది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ.. పెద్ద హీరోల సినిమాల్లో సైతం కొత్తదనం చూపిస్తూ.. మిగతా ఫిలిం ఇండస్ట్రీలన్నింటికీ అది ఆదర్శంగా ఉండేది. ఓవైపు తెలుగులో రొటీన్ మాస్ మసాలా సినిమాలు వస్తుంటే.. మరోవైపు తమిళంలో అద్భుతమైన సినిమాలు తెరకెక్కడం చూసి ఇక్కడి హీరోలు, దర్శకులను మన ప్రేక్షకులు విమర్శించేవాళ్లు. తమిళోళ్లను చూసి నేర్చుకోవాలని అనేవారు. కానీ గత కొన్నేళలో పరిస్థితి మొత్తం మారిపోయింది. తమిళ సినిమాల క్వాలిటీ పడిపోయింది. కొత్తదనం అటకెక్కింది.
శంకర్, మురుగదాస్ సహా చాలామంది టాప్ డైరెక్టర్లు ఫాం కోల్పోయారు. ఎప్పుడో కానీ ఒక మంచి సినిమా రాని పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడి దర్శకులు, హీరోలు వడ్డించిందే మహాప్రసాదం అనుకుని సర్దుకుపోవాల్సిన పరిస్థితి తమిళ ప్రేక్షకులకు తలెత్తింది.
విజయ్ చేసిన మెర్శల్, బిగిల్, మాస్టర్.. అజిత్ నుంచి వచ్చిన విశ్వాసం, వలిమై, రజినీకాంత్ తీసిన దర్బార్, అన్నాత్తె.. ఇలా ఏ సినిమా తీసుకున్నా కొత్తగా అనిపించేవి కావు. ఇవన్నీ చాలా వరకు రొటీన్ మాస్ మసాలా సినిమాలే. కానీ వీటికే తమిళ ప్రేక్షకులు పట్టం కట్టారు. కానీ ఒకప్పుడు వైభవం చూసిన తమిళ సినిమా ఈ స్థాయికి పడిపోవడం అక్కడ అభిరుచి ఉన్న ప్రేక్షకులకు ఆవేదన కలిగిస్తూనే ఉంది. ఇలాంటి టైంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘విక్రమ్’ సినిమా తమిళ ఆడియన్స్కు వరప్రసాదంలా మారింది. తమిళంలో ఈ మాత్రం కొత్తదనం ఉన్న, ఉత్కంఠభరితంగా సాగిన సినిమా వచ్చి చాలా కాలం అయింది.
‘ఖైదీ’తో అందరినీ మెప్పించిన లోకేష్.. మళ్లీ కంటెంట్ పరంగా దానికి దగ్గరగా నిలిచేలా ‘విక్రమ్’ను తీర్చిదిద్దాడు. కథలో వైవిధ్యం, కథనంలో వేగం, అలాగే ప్రధాన పాత్రధారుల నటన, టెక్నీషియన్స్ సపోర్ట్ బాగా కుదిరి ఈ సినిమా తమిళంలో బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. లేక లేక కంటెంట్ ఉన్న ఓ పెద్ద సినిమా రావడంతో తమిళ ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. వీకెండ్లో అక్కడీ సినిమా దుమ్ముదులిపేలాగే ఉంది. సినిమాకు లాంగ్ రన్ గ్యారెంటీ అనిపిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో కూడా ‘విక్రమ్’ టాక్ బాగానే ఉంది. మరి దీన్నుంచి ఇన్స్పైర్ అయి మిగతా హీరోలు, దర్శకులు కూడా తమిళ సినిమాకు పునర్వైభవం తెచ్చేలా మంచి సినిమాలు చేస్తారేమో చూడాలి.
This post was last modified on June 4, 2022 3:06 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…