కేవలం 20 రోజులకే సర్కారు వారి పాట ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేయడంతో మరోసారి థియేటర్ల మనుగడకు సంబంధించిన చర్చ మొదలయ్యింది. నిన్న పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జనాలు సినిమా హాళ్లకు రావడం చాలా తగ్గించారని, అల్లు అర్జున్ ఎఫ్3ని క్యూబ్ లో చూస్తానని అడిగితే వద్దు సింగల్ స్క్రీన్లోనే ఎంజాయ్ చేయమని కూకట్ పల్లికి పంపించానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరే వాళ్లంటే సెలబ్రిటీలు ఎలా చూసినా చెల్లుతుంది కానీ సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి అలా ఉండదుగా. దేనికైనా ఓ పద్ధతి ప్రకారం లెక్కలు వేసుకోవాలి.
ఇకపై రాబోయే సినిమాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ తో ఓటిటిలో రావాలనే నిబంధనను నిర్మాతల మండలి తీసుకురాబోతోందట. అంటే రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ అన్నమాట. ఆమేరకు ప్రొడ్యూసర్లతో అగ్రిమెంట్ కూడా చేస్తారు. ఇలాంటివి గతంలో చాలా చెప్పారు చేశారు. కానీ ప్రాక్టికల్ గా ఏదీ సాధ్యపడలేదు. కేవలం 14 రోజులకే ప్రైమ్ లో ప్రత్యక్షమైన చిన్న సినిమాలున్నాయి. ఆదాయం కోసమో లేక ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశంతోనో ఓటిటిలు ఈ విషయంలో మంచే చేశాయి. కానీ బడా స్టార్ల ప్యాన్ ఇండియా సినిమాలే మూడో వారం దాటగానే జై ఓటిటి అంటుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
క్షేత్ర స్థాయిలో చాలా మార్పులు జరగాలి. పుష్ప పార్ట్ 1 ది రైజ్, ఆచార్య, రాదే శ్యాం, సర్కారు వారి పాట ఇవన్నీ 21 రోజులకు ప్రైమ్ లో వచ్చిన సినిమాలు. ఆర్ఆర్ఆర్ 50 రోజులకు, కెజిఎఫ్ 2 హాఫ్ సెంచరీ అయ్యాక ప్రీమియర్ చేసుకున్నాయి. చిన్న చిత్రాలను నిందించడానికి లేదు. నాలుగో రోజే డెఫిషిట్లతో నెగటివ్ షేర్ లో పడిపోతున్న వీటికి కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదు. అలా చేస్తే ఓటిటి సంస్థలు ఇచ్చే మొత్తంలో భారీ కోత విధిస్తాయి. ఈ ఓటిటి పంచాయితీ తర్వాత చూసుకోవచ్చు. ముందు ప్రతి కొత్త సినిమాకు టికెట్ రేట్లను మార్చి మార్చి ప్రేక్షకులను అయోమయానికి గురి చేసే పద్ధతికి స్వస్తి చెబితే జనాన్ని థియేటర్ కు ఎలా రప్పించాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు. అంతే తప్ప కేవలం ఓటిటిలో రావడమే దెబ్బకొడుతోందన్న కోణంలో ఆలోచిస్తే పరిష్కారం దొరకదు.
This post was last modified on June 5, 2022 7:36 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…