చివరగా గత ఏడాది చివర్లో శ్యామ్ సింగరాయ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు నేచురల్ స్టార్ నాని. ఓటీటీల్లో వచ్చిన వి, టక్ జగదీష్ చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాక ఈ సినిమా నానీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. శ్యామ్ సింగరాయ్ హిట్ ఊపులో ఇప్పుడు బ్లాక్బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు నాని. అతడి కొత్త చిత్రం అంటే సుందరానికీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పేరు దగ్గర్నుంచి ప్రతిదీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఒక పద్ధతైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయికి.. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. సినిమాలో ఇది కాక ఇంకేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. దాన్ని ట్రైలర్లో సస్పెన్స్లాగా దాచి పెట్టారు. అదేంటో థియేటర్లలోనే చూడాలి.
కాగా అంటే సుందరానికీ మీద నాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని అతడి మాటల్ని బట్టి అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతను పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. మామూలుగా మంచి సినిమా తీశాం బ్లాక్బస్టర్ చేయండని ప్రేక్షకులను అడుగుతుంటామని, కానీ ఈసారి కథ వేరని, తాము బ్లాక్బస్టర్ సినిమా తీశామని, ఇక దాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తారన్నది ప్రేక్షకుల ఇష్టమని వ్యాఖ్యానించాడు నాని. తమ సినిమాలు రిలీజవున్నపుడు ప్రతి హీరో ఇలా గొప్పలు పోవడం మామూలే కానీ.. నాని మాటలు అతిశయోక్తిలాగా ఏమీ అనిపించలేదు. అంటే సుందరానికీ ప్రోమోలతో సినిమా ఇప్పటికే పెరిగిన అంచనాలను అతడి మాటలు ఇంకా పెంచేలాగే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజ్రీన్ నటించింది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.
This post was last modified on June 4, 2022 7:59 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…