చివరగా గత ఏడాది చివర్లో శ్యామ్ సింగరాయ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు నేచురల్ స్టార్ నాని. ఓటీటీల్లో వచ్చిన వి, టక్ జగదీష్ చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాక ఈ సినిమా నానీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. శ్యామ్ సింగరాయ్ హిట్ ఊపులో ఇప్పుడు బ్లాక్బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు నాని. అతడి కొత్త చిత్రం అంటే సుందరానికీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పేరు దగ్గర్నుంచి ప్రతిదీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఒక పద్ధతైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయికి.. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. సినిమాలో ఇది కాక ఇంకేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. దాన్ని ట్రైలర్లో సస్పెన్స్లాగా దాచి పెట్టారు. అదేంటో థియేటర్లలోనే చూడాలి.
కాగా అంటే సుందరానికీ మీద నాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని అతడి మాటల్ని బట్టి అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతను పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. మామూలుగా మంచి సినిమా తీశాం బ్లాక్బస్టర్ చేయండని ప్రేక్షకులను అడుగుతుంటామని, కానీ ఈసారి కథ వేరని, తాము బ్లాక్బస్టర్ సినిమా తీశామని, ఇక దాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తారన్నది ప్రేక్షకుల ఇష్టమని వ్యాఖ్యానించాడు నాని. తమ సినిమాలు రిలీజవున్నపుడు ప్రతి హీరో ఇలా గొప్పలు పోవడం మామూలే కానీ.. నాని మాటలు అతిశయోక్తిలాగా ఏమీ అనిపించలేదు. అంటే సుందరానికీ ప్రోమోలతో సినిమా ఇప్పటికే పెరిగిన అంచనాలను అతడి మాటలు ఇంకా పెంచేలాగే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజ్రీన్ నటించింది. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…