సోషల్ మీడియాలో సెలబ్రెటీల మీద విషం కక్కే ఊరూ పేరూ లేని ట్విట్టర్ ఐడీలు చాలానే ఉంటాయి. ఐడెంటిటీ ఉండదు కాబట్టి ఎవరిని ఎంత మాటైనా అనేయొచ్చని ఫీలవుతుంటారు నెటిజన్లు. సెలబ్రెటీలకు ఇలాంటి వాళ్లను పట్టించుకునే తీరిక, ఓపిక ఉండదు కాబట్టి వాళ్ల బండి నడిచిపోతుంటుంది. కానీ కొందరు సెలబ్రెటీలు ఇలాంటి వాళ్లను ఊరికే వదలరు. కొందరు తీవ్ర పదజాలంతోనే సమాధానం ఇస్తుంటారు.
ఇంకొందరు సున్నితంగానే దీటైన జవాబిస్తుంటారు. కామెంట్ చేసిన వాళ్లు సిగ్తుతో తలదించుకునేలా చేస్తుంటారు. టాలీవుడ్ యువ నటుడు దగ్గుబాటి రానా కూడా అదే పని చేశాడు. తనను తక్కువ చేసి మాట్లాడిన ఓ నెటిజన్కు సున్నితమైన మాటలతోనే చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాడు.
రానా కొత్త సినిమా విరాటపర్వం నుంచి తాజాగా ఒక పోస్టర్ లాంచ్ చేశారు. అందులో రానా ముఖం కనిపించడం లేదు. అతడిని హత్తుకుని ఉన్న సాయిపల్లవినే హైలైట్ అయింది. ఆమె మీదే ఫోకస్ పెట్టారు పోస్టర్లో. ఇది చూపి ఒక నెటిజన్.. ఛీ దరిద్రం సొంత బేనర్లోనే ఫేస్ కట్ చేశారు. ఇక బయటి వాళ్లు వేలెత్తి చూపించడంలో తప్పేముందిలే. వాళ్ల వీళ్ల సినిమాల్లో తక్కువ క్యారెక్టర్స్ చేయడం అందరికీ లోకువ అయిపోవడం దగ్గుబాటి రానా స్టైల్ అని కామెంట్ చేశాడు.
రానా ఈ కామెంట్ను పట్టించుకోకుండా వదిలేయలేదు. అలాగని ఆ నెటిజన్ లాగా నోరు జారలేదు. మనం తగ్గి కథను హీరోయిన్న ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్. సొంత బేనర్ కదా. గొప్ప పనులు ఇక్కడే చేయొచ్చు అని బదులిచ్చాడు. రానా ఇచ్చిన సమాధానంపై ప్రశంసల జల్లు కురిసింది. సదరు నెటిజన్ సిగ్గుపడేలా భలే జవాబిచ్చావంటూ అతడిని అందరూ కొనియాడుతున్నారు.
This post was last modified on June 4, 2022 7:51 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…