Movie News

కమలే ఒప్పుకున్నాడు.. తెలుగు సినిమాకు తిరుగులేదని

ఒక 20 ఏళ్లు వెనక్కి వెళ్తే.. తమిళ సినిమాల ముందు తెలుగు చిత్రాలు అస్సలు నిలిచేవి కావు. ఇక్కడ మన వాళ్లు రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీస్తుంటే.. తమిళంలో గొప్ప గొప్ప ప్రయోగాలు జరిగేవి. కమర్షియల్ సినిమాల్లో కూడా కొత్తదనం ఉండేది. ఆ సినిమాలకు రీచ్ బాగా ఉండేది.

తెలుగులోకి అనువాదం అయి ఇక్కడ ఇరగాడేసేవి. అదే సమయంలో తెలుగు సినిమాలను తమిళనాట రిలీజ్ చేసే పరిస్థితే ఉండేది కాదు. కమర్షియల్‌గా తమిళ చిత్రాలు పెద్ద సక్సెస్ కావడమే కాదు.. జాతీయ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డుల్లోనూ ఆధిపత్యాన్ని చాటేవి. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి.

ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. మన చిత్రాల మార్కెట్ పరిధిగా బాగా విస్తరించింది. ఇటీవల పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా బలం ఇంకా పెరిగింది. అదే సమయంలో తమిళ చిత్రాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. వాటి క్వాలిటీ, మార్కెట్ పరిధి కుచించుకుపోతోంది.

ఈ పరిణామ క్రమాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ బాగానే అర్థం చేసుకున్నట్లున్నారు. తెలుగులో రిలీజవుతున్న తన కొత్త చిత్రం ‘విక్రమ్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయ సినిమా హబ్‌గా హైదరాబాద్ నిలిచే లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఇంతకుముందు చెన్నై ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఆ దిశగా ఎదుగుతోంది’’ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఇక ఒకప్పటి తెలుగు సినిమాల వైభవం గురించి కమల్ మాట్లాడుతూ.. ‘‘పాత చరిత్ర చూస్తే ఏఎన్నార్ ‘దేవదాస్’ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్లు ఆడింది. ‘మరో చరిత్ర’ తెలుగు చిత్రంగానే అక్కడ రెండున్నరేళ్లు ఆడింది. ‘శంకరాభరణం’ కూడా అలాగే చరిత్ర సృష్టించింది. ‘సాగరసంగమం’ డబ్ అయి సిల్వర్ జూబ్లీ ఆడింది. పాన్ ఇండియా ట్రెండ్‌ను బాలచందర్ ఎప్పుడో పరిచయం చేశారు. ఆయనకంటే ముందు ఏఎన్నార్ ఉన్నారు. నాగిరెడ్డి గారు తెలుగుతో పాటు తమిళంలోనూ పెద్ద పెద్ద సినిమాలు తీశారు’’ అని కమల్ పేర్కొన్నాడు.

This post was last modified on June 2, 2022 4:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సోషల్ మీడియాలో పాయల్ ఆవేదన

పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…

1 hour ago

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ…

2 hours ago

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ…

4 hours ago

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం…

6 hours ago

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని..…

8 hours ago

మూడో భారతీయుడు షాక్ ఇస్తాడా

అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…

14 hours ago