ఫ్లాప్ అందుకున్న హీరోతో సినిమా చేస్తే ఆ దర్శకుడిపై చాలా భారం ఉంటుంది. ఆ హీరోకి మళ్ళీ ఎలాగైనా హిట్ ఇచ్చే భాద్యత ఆ దర్శకుడిపై పడుతుంది. తాజాగా అలాంటి భారం , భాద్యత రెండూ ఇప్పుడు వంశీ పైడిపల్లి పై పడ్డాయి. అవును విజయ్ తో వంశీ తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు. విజయ్ ప్రీవియస్ మూవీ ‘బీస్ట్’ ఫ్యాన్స్ ని సైతం నిరాశ పరిచింది. కోలీవుడ్ లో ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. విజయ్ కి ఉన్న క్రేజ్ తో మోస్తరు కలెక్షన్లు వచ్చాయి.
అందుకే ఇప్పుడు విజయ్ తో వంశీ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కోలీవుడ్ ఆడియన్స్. విజయ్ ఫ్యాన్స్ టాలీవుడ్ డైరెక్టర్ తమ హీరోకి రెండు భాషల్లోనూ అదిరిపోయే హిట్ ఇస్తాడని ఆశలు పెట్టుకుంటున్నారు. నిజానికి వంశీ తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేయాలి. ఇది విజయ్ కి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాతో స్ట్రైట్ హీరోగా ఇక్కడ మరింత మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు విజయ్. అందుకే వంశీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి వంశీ విజయ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో , తమిళ్ , తెలుగు ఆడియన్స్ ని ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్ వంటి వెర్సటైల్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే మొదటి షెడ్యుల్ కంప్లీట్ చేశారు. మరికొద్ది రోజుల్లో రెండో షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు.
This post was last modified on June 2, 2022 4:32 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…