ఫ్లాప్ అందుకున్న హీరోతో సినిమా చేస్తే ఆ దర్శకుడిపై చాలా భారం ఉంటుంది. ఆ హీరోకి మళ్ళీ ఎలాగైనా హిట్ ఇచ్చే భాద్యత ఆ దర్శకుడిపై పడుతుంది. తాజాగా అలాంటి భారం , భాద్యత రెండూ ఇప్పుడు వంశీ పైడిపల్లి పై పడ్డాయి. అవును విజయ్ తో వంశీ తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు. విజయ్ ప్రీవియస్ మూవీ ‘బీస్ట్’ ఫ్యాన్స్ ని సైతం నిరాశ పరిచింది. కోలీవుడ్ లో ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. విజయ్ కి ఉన్న క్రేజ్ తో మోస్తరు కలెక్షన్లు వచ్చాయి.
అందుకే ఇప్పుడు విజయ్ తో వంశీ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కోలీవుడ్ ఆడియన్స్. విజయ్ ఫ్యాన్స్ టాలీవుడ్ డైరెక్టర్ తమ హీరోకి రెండు భాషల్లోనూ అదిరిపోయే హిట్ ఇస్తాడని ఆశలు పెట్టుకుంటున్నారు. నిజానికి వంశీ తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేయాలి. ఇది విజయ్ కి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాతో స్ట్రైట్ హీరోగా ఇక్కడ మరింత మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు విజయ్. అందుకే వంశీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి వంశీ విజయ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో , తమిళ్ , తెలుగు ఆడియన్స్ ని ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్ వంటి వెర్సటైల్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే మొదటి షెడ్యుల్ కంప్లీట్ చేశారు. మరికొద్ది రోజుల్లో రెండో షెడ్యుల్ మొదలు పెట్టనున్నారు.
This post was last modified on June 2, 2022 4:32 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…