ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుమీదున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిపోగా కీలకమైన క్యాస్టింగ్ ని చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడమనే పాయింట్ తప్ప యూనిట్ నుంచి ఇంకే అప్ డేట్ అఫీషియల్ గా రాలేదు. అందుకే ఎవరెవరు నటిస్తారనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. ముఖ్యంగా ఇతర బాషల నుంచి నోటెడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా తీసుకొచ్చే త్రివిక్రమ్ ఈసారి కూడా అలాగే చేయబోతున్నారట.
కన్నడలో క్రేజీ స్టార్ గా పిలవబడే శాండల్ వుడ్ సీనియర్ హీరో వి రవిచంద్రన్ ను ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నట్టు సమాచారం. చాలా కీలకంగా కనిపించే ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆయన్ను సంప్రదించినట్టు తెలిసింది. రవిచంద్రన్ ఇప్పటి జెనరేషన్ కు అంతగా తెలిసుండకపోవచ్చు కానీ నిన్నటి యువతరానికి మాత్రం సుపరిచితులే. ఇప్పుడు కెజిఎఫ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 1990లోనే ముగ్గురు బడా హీరోలతో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ చేసిన ఒకే ఒక కన్నడ సినిమా సిపాయి రవిచంద్రన్ తీసిందే. ఒకప్పుడు ప్రేమలోకం లాంటి డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ అక్కడి యూత్ హీరోలతో పోటీ పడే రవిచంద్రన్ నిజంగా మహేష్ బాబుతో జట్టు కడితే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి తాజా కలయికలను సెట్ చేయడంలో నిష్ణాతుడైన త్రివిక్రమ్ మరి ఫైనల్ గా ఆయన్ను స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ద్వారా మనకు పరిచయం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…