ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుమీదున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిపోగా కీలకమైన క్యాస్టింగ్ ని చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడమనే పాయింట్ తప్ప యూనిట్ నుంచి ఇంకే అప్ డేట్ అఫీషియల్ గా రాలేదు. అందుకే ఎవరెవరు నటిస్తారనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. ముఖ్యంగా ఇతర బాషల నుంచి నోటెడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా తీసుకొచ్చే త్రివిక్రమ్ ఈసారి కూడా అలాగే చేయబోతున్నారట.
కన్నడలో క్రేజీ స్టార్ గా పిలవబడే శాండల్ వుడ్ సీనియర్ హీరో వి రవిచంద్రన్ ను ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నట్టు సమాచారం. చాలా కీలకంగా కనిపించే ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆయన్ను సంప్రదించినట్టు తెలిసింది. రవిచంద్రన్ ఇప్పటి జెనరేషన్ కు అంతగా తెలిసుండకపోవచ్చు కానీ నిన్నటి యువతరానికి మాత్రం సుపరిచితులే. ఇప్పుడు కెజిఎఫ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 1990లోనే ముగ్గురు బడా హీరోలతో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ చేసిన ఒకే ఒక కన్నడ సినిమా సిపాయి రవిచంద్రన్ తీసిందే. ఒకప్పుడు ప్రేమలోకం లాంటి డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ అక్కడి యూత్ హీరోలతో పోటీ పడే రవిచంద్రన్ నిజంగా మహేష్ బాబుతో జట్టు కడితే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి తాజా కలయికలను సెట్ చేయడంలో నిష్ణాతుడైన త్రివిక్రమ్ మరి ఫైనల్ గా ఆయన్ను స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ద్వారా మనకు పరిచయం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
This post was last modified on June 2, 2022 10:25 am
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…