ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుమీదున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిపోగా కీలకమైన క్యాస్టింగ్ ని చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడమనే పాయింట్ తప్ప యూనిట్ నుంచి ఇంకే అప్ డేట్ అఫీషియల్ గా రాలేదు. అందుకే ఎవరెవరు నటిస్తారనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. ముఖ్యంగా ఇతర బాషల నుంచి నోటెడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా తీసుకొచ్చే త్రివిక్రమ్ ఈసారి కూడా అలాగే చేయబోతున్నారట.
కన్నడలో క్రేజీ స్టార్ గా పిలవబడే శాండల్ వుడ్ సీనియర్ హీరో వి రవిచంద్రన్ ను ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నట్టు సమాచారం. చాలా కీలకంగా కనిపించే ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆయన్ను సంప్రదించినట్టు తెలిసింది. రవిచంద్రన్ ఇప్పటి జెనరేషన్ కు అంతగా తెలిసుండకపోవచ్చు కానీ నిన్నటి యువతరానికి మాత్రం సుపరిచితులే. ఇప్పుడు కెజిఎఫ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 1990లోనే ముగ్గురు బడా హీరోలతో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ చేసిన ఒకే ఒక కన్నడ సినిమా సిపాయి రవిచంద్రన్ తీసిందే. ఒకప్పుడు ప్రేమలోకం లాంటి డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ అక్కడి యూత్ హీరోలతో పోటీ పడే రవిచంద్రన్ నిజంగా మహేష్ బాబుతో జట్టు కడితే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి తాజా కలయికలను సెట్ చేయడంలో నిష్ణాతుడైన త్రివిక్రమ్ మరి ఫైనల్ గా ఆయన్ను స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ద్వారా మనకు పరిచయం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
This post was last modified on June 2, 2022 10:25 am
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…