Movie News

మహేష్ మూవీలో క్రేజీ కన్నడ స్టార్

ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుమీదున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిపోగా కీలకమైన క్యాస్టింగ్ ని చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడమనే పాయింట్ తప్ప యూనిట్ నుంచి ఇంకే అప్ డేట్ అఫీషియల్ గా రాలేదు. అందుకే ఎవరెవరు నటిస్తారనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. ముఖ్యంగా ఇతర బాషల నుంచి నోటెడ్ ఆర్టిస్టులను ప్రత్యేకంగా తీసుకొచ్చే త్రివిక్రమ్ ఈసారి కూడా అలాగే చేయబోతున్నారట.

కన్నడలో క్రేజీ స్టార్ గా పిలవబడే శాండల్ వుడ్ సీనియర్ హీరో వి రవిచంద్రన్ ను ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నట్టు సమాచారం. చాలా కీలకంగా కనిపించే ఈ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆయన్ను సంప్రదించినట్టు తెలిసింది. రవిచంద్రన్ ఇప్పటి జెనరేషన్ కు అంతగా తెలిసుండకపోవచ్చు కానీ నిన్నటి యువతరానికి మాత్రం సుపరిచితులే. ఇప్పుడు కెజిఎఫ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 1990లోనే ముగ్గురు బడా హీరోలతో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రోల్ చేసిన ఒకే ఒక కన్నడ సినిమా సిపాయి రవిచంద్రన్ తీసిందే. ఒకప్పుడు ప్రేమలోకం లాంటి డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ అక్కడి యూత్ హీరోలతో పోటీ పడే రవిచంద్రన్ నిజంగా మహేష్ బాబుతో జట్టు కడితే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి తాజా కలయికలను సెట్ చేయడంలో నిష్ణాతుడైన త్రివిక్రమ్ మరి ఫైనల్ గా ఆయన్ను స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ద్వారా మనకు పరిచయం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

This post was last modified on June 2, 2022 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన…

27 minutes ago

సాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది!

యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…

1 hour ago

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…

2 hours ago

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…

2 hours ago

మీ కోసం కాల్ చేసే గూగుల్.. ‘ఆస్క్ ఫర్ మీ’ AI ప్రయోగం!

రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…

3 hours ago

కాలు క‌ద‌ప‌రు.. వాయిస్ పెంచ‌రు.. ఇదేం రాజ‌కీయం.. !

ఒక‌వైపు వైసీపీ నుంచి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు. ప్ర‌భుత్వం ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం లేద‌ని.. ఇక‌, చేయ‌ద‌ని .. చంద్ర‌బాబు పేద‌ల‌కు…

3 hours ago