శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘RC15’ చిన్న చిన్న బ్రేకులతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే నలబై శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది.
సినిమాకు పనిచేస్తున్న టాప్ టెక్నీషియన్ ఒకరు బయటికి వచ్చేశారని తెలుస్తుంది. అతను మరెవరో కాదు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ అని అంటున్నారు. రామకృష్ణ సబ్బాని ‘రంగస్థలం’ తో టాప్ టెక్నీషియన్ గా గుర్తింపు అందుకున్నాడు. అందుకే శంకర్ , చరణ్ , దిల్ రాజు అతన్ని ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ సినిమాకు భారీ సెట్స్ వేసింది రామకృష్ణనే.
తాజాగా సెట్స్ లో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆయన సినిమా నుండి బయటి కొచ్చేశాడని ,ఆయన ప్లేస్ లో తాజాగా రవీందర్ ని తీసుకున్నారని టాక్ వినబడుతుంది. రవీందర్ ఇటివలే ‘రాధే శ్యామ్’ కి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ‘మగధీర’ కి అదిరిపోయే సెట్స్ వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.
కొన్ని బడా సినిమాల విషయంలో ఇలా ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరి వాటిలానే ఇది కూడా ఓ రూమరేనా ? లేదా నిజంగానే రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా ? తెలియాలంటే నెక్స్ట్ షెడ్యుల్ మొదలయ్యే వరకూ ఆగాల్సిందే. RC15 నెక్స్ట్ షెడ్యుల్ డిల్లీ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత యూనిట్ రాజమండ్రి, హైదరాబాద్ లో షెడ్యుల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on June 2, 2022 8:42 am
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాంచి ఊపుమీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన…
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో…
కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయ్యాయి. సంతృప్తి విషయంలో కూటమి పార్టీల నాయకులు తల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…
దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా…
తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…