Movie News

#RC15 – ఆ టెక్నీషియన్ బయటికొచ్చేశాడా ?

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘RC15’ చిన్న చిన్న బ్రేకులతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే నలబై శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది.

సినిమాకు పనిచేస్తున్న టాప్ టెక్నీషియన్ ఒకరు బయటికి వచ్చేశారని తెలుస్తుంది. అతను మరెవరో కాదు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ అని అంటున్నారు. రామకృష్ణ సబ్బాని ‘రంగస్థలం’ తో టాప్ టెక్నీషియన్ గా గుర్తింపు అందుకున్నాడు. అందుకే శంకర్ , చరణ్ , దిల్ రాజు అతన్ని ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ సినిమాకు భారీ సెట్స్ వేసింది రామకృష్ణనే. 

తాజాగా సెట్స్ లో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆయన సినిమా నుండి బయటి కొచ్చేశాడని ,ఆయన ప్లేస్ లో తాజాగా రవీందర్ ని తీసుకున్నారని టాక్ వినబడుతుంది. రవీందర్ ఇటివలే ‘రాధే శ్యామ్’ కి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ‘మగధీర’ కి అదిరిపోయే సెట్స్ వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.


 కొన్ని బడా సినిమాల విషయంలో ఇలా ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరి వాటిలానే ఇది కూడా ఓ రూమరేనా ? లేదా నిజంగానే రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా ? తెలియాలంటే నెక్స్ట్ షెడ్యుల్ మొదలయ్యే వరకూ ఆగాల్సిందే. RC15 నెక్స్ట్ షెడ్యుల్ డిల్లీ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత యూనిట్ రాజమండ్రి, హైదరాబాద్ లో షెడ్యుల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

This post was last modified on June 2, 2022 8:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

2 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

5 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

6 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

9 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

9 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

10 hours ago