జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ తాలూకు పనులు జెట్ స్పీడ్ తో కాదు కానీ ఒక్కొక్కటిగా మెల్లగా జరుగుతున్నాయి. కాన్సెప్ట్ రివీల్ చేస్తూ చిన్న వీడియో అయితే వదిలడం తప్ప ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ఇందులో సీనియర్ హీరోయిన్ సోనాలి బెంద్రే ఓ కీలక పాత్ర చేయనుందని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది.
కథను మలుపు తిప్పే ముఖ్యమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశారని అందుకావిడ ఒప్పుకుందని కూడా రకరకాల కథనాలు వచ్చాయి. వీటికి సోనాలి బెంద్రే స్వయంగా స్పందించారు. అలాంటి ప్రతిపాదన కానీ ఆఫర్ కానీ ఏదీ రాలేదని తేల్చి చెప్పేశారు. నాకు తెలియకుండా ఇదంతా జరగడం చూస్తే సస్పెన్స్ సినిమాలా ఉందని కూడా చమత్కరించారు.
సో ఫైనల్ గా ఇందులో సోనాలి లేదనే స్పష్టత వచ్చేసింది. ఒకప్పుడు తెలుగులో మురారి, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ ఆమెకున్నాయి. ఒక్క పలనాటి బ్రహ్మనాయుడు మాత్రమే ఫ్లాప్ గా నిలిచింది. 2003లో చిరంజీవితో జోడికట్టిన తర్వాత సోనాలి మళ్ళీ టాలీవుడ్లో కనిపించలేదు
ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ అనగానే ఫ్యాన్స్ సంబరపడ్డారు. క్యాన్సర్ తో పోరాడి చావును జయించి తిరిగి సామాన్య జనజీవనంలోకి వచ్చిన సోనాలి బెంద్రే నటించడం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. రెండు మూడు బాలీవుడ్ ప్రపోజల్స్ ని పెండింగ్ లో ఉంచింది. సరే ఇప్పుడు ఆమె లేదని తేలిపోయింది కానీ కొరటాల శివ ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. నదియా, టబు, ఖుష్బూ, రమ్యకృష్ణ, కస్తూరి లాంటి కొన్ని ఆప్షన్లు చూస్తున్నారట కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.
This post was last modified on May 31, 2022 11:26 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…