త్వరలో ప్రారంభం కానున్న మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడో స్క్రిప్ట్ సిద్ధమై ఓకే చేసుకున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ తారాగణం సెట్ చేయడం సవాల్ గా మారిందట. ముఖ్యంగా విలన్ ని ఎంపిక చేసుకునే చెసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మాటల మాంత్రికుడు ఇందులో కూడా క్రేజీ యాక్టర్ ని తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ రిపోర్ట్. ప్యాన్ ఇండియా కాకపోయినా సౌత్ మార్కెట్ కోసమైనా ఇలాంటి జాగ్రత్తలు అవసరం.
రెండు రోజుల క్రితం నందమూరి తారకరత్న పేరు సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆయన దాన్ని ఖండించారు కూడా. అయినా నిజంగా తనున్నా కూడా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఆ మాటకొస్తే ఇది నిజం కాకపోతే బాగుండని మహేష్ ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, పృథ్విరాజ్ సుకుమారన్లలో ఒకరిని ట్రై చేస్తున్నట్టు వీళ్ళలో మొదటి ఇద్దరు ఆల్రెడీ ఉప్పెన, పుష్పలతో తెలుగులోనూ మంచి గుర్తింపు ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఎటొచ్చి పృథ్విరాజే పెండింగ్.
సాధారణంగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని అంత ఈజీగా ఒప్పుకోని ఈ టాలెంటెడ్ యాక్టర్ మహేష్ కు ఓకే చెబుతాడా అనేది వేచి చూడాలి. భీమ్లా నాయక్ లో రానా వేసిన పాత్రను ఒరిజినల్ చేసింది ఇతనే. చిరంజీవి గాడ్ ఫాదర్ మాతృక లూసిఫర్ దర్శకుడు కూడా ఈ పృథ్వి రాజే. ఒకవేళ ఒప్పుకుంటే స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ ఫీల్ అవుతుంది. సర్కారు వారి పాట హిట్ అనిపించుకున్న దాని ఫైనల్ స్టేటస్ పట్ల అంత సంతృప్తిగా లేని అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలు అన్ని ఇన్ని కావు. అందుకే ఇంత ప్లానింగ్.
This post was last modified on May 30, 2022 9:25 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…