త్వరలో ప్రారంభం కానున్న మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడో స్క్రిప్ట్ సిద్ధమై ఓకే చేసుకున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ తారాగణం సెట్ చేయడం సవాల్ గా మారిందట. ముఖ్యంగా విలన్ ని ఎంపిక చేసుకునే చెసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మాటల మాంత్రికుడు ఇందులో కూడా క్రేజీ యాక్టర్ ని తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ రిపోర్ట్. ప్యాన్ ఇండియా కాకపోయినా సౌత్ మార్కెట్ కోసమైనా ఇలాంటి జాగ్రత్తలు అవసరం.
రెండు రోజుల క్రితం నందమూరి తారకరత్న పేరు సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆయన దాన్ని ఖండించారు కూడా. అయినా నిజంగా తనున్నా కూడా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఆ మాటకొస్తే ఇది నిజం కాకపోతే బాగుండని మహేష్ ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, పృథ్విరాజ్ సుకుమారన్లలో ఒకరిని ట్రై చేస్తున్నట్టు వీళ్ళలో మొదటి ఇద్దరు ఆల్రెడీ ఉప్పెన, పుష్పలతో తెలుగులోనూ మంచి గుర్తింపు ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఎటొచ్చి పృథ్విరాజే పెండింగ్.
సాధారణంగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని అంత ఈజీగా ఒప్పుకోని ఈ టాలెంటెడ్ యాక్టర్ మహేష్ కు ఓకే చెబుతాడా అనేది వేచి చూడాలి. భీమ్లా నాయక్ లో రానా వేసిన పాత్రను ఒరిజినల్ చేసింది ఇతనే. చిరంజీవి గాడ్ ఫాదర్ మాతృక లూసిఫర్ దర్శకుడు కూడా ఈ పృథ్వి రాజే. ఒకవేళ ఒప్పుకుంటే స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ ఫీల్ అవుతుంది. సర్కారు వారి పాట హిట్ అనిపించుకున్న దాని ఫైనల్ స్టేటస్ పట్ల అంత సంతృప్తిగా లేని అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలు అన్ని ఇన్ని కావు. అందుకే ఇంత ప్లానింగ్.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…