Movie News

యష్ కొత్త సినిమాకు దర్శకుడు ఫిక్స్ ?

KGF యునానిమస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నెక్స్ట్ ఏ సినిమా చేయాలో తెలియని ఒత్తిడిలో పడిపోయిన రాఖీ భాయ్ అలియాస్ హీరో యష్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నాడని బెంగళూరు టాక్. నర్తన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి.

కానీ ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పట్టింది. పలు వెర్షన్ల మీద వర్క్ చేసి ఫైనల్ గా ఒకటి సంతృప్తికరంగా రావడంతో యూనిట్ అంగీకారానికి వచ్చిందని వినికిడి. ఈ నర్తన్ ఎవరనే ఆసక్తి రేగడం సహజం. 2017లో కన్నడలో శివరాజ్ కుమార్ – శ్రీమురళి కాంబినేషన్ లో మఫ్టీ వచ్చింది. ఇది పెద్ద హిట్టు. తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ ఫలించలేదు.

తమిళంలో శింబు – గౌతమ్ కార్తీక్ హీరోలుగా పత్తు తల టైటిల్ తో షూటింగ్ మొదలుపెట్టాక ఏవో కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ కొనసాగిస్తారో లేదో డౌటే. నర్తన్ కు ప్రశాంత్ నీల్ దగ్గర పని చేసిన అనుభవం అది. కన్నడ డైరెక్టర్లతోనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న యష్ ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు

ఇకపై చేయబోయే సినిమాలన్నీ ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ అవుతాయి కాబట్టి కథల ఎంపికలో యష్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో తొందరపడలేదు కానీ మరీ ఆలస్యం చేసినా ఇబ్బందే. మన దిల్ రాజుకు హోంబాలే ఫిలింస్ తో కలిసి ఒక ప్రాజెక్టు ఓకే చేశాడని టాక్ వచ్చింది కానీ దాన్ని డీల్ చేసేది నర్తనా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది. కెజిఎఫ్ 2 హవా తగ్గిపోయి ఓటిటిలో కూడా వచ్చేసింది కాబట్టి ఇక రాబోయే సినిమాల వేగం పెంచడం చాలా అవసరం.   

This post was last modified on May 28, 2022 7:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

43 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

45 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago