Movie News

యష్ కొత్త సినిమాకు దర్శకుడు ఫిక్స్ ?

KGF యునానిమస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నెక్స్ట్ ఏ సినిమా చేయాలో తెలియని ఒత్తిడిలో పడిపోయిన రాఖీ భాయ్ అలియాస్ హీరో యష్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నాడని బెంగళూరు టాక్. నర్తన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన చర్చలు గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి.

కానీ ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పట్టింది. పలు వెర్షన్ల మీద వర్క్ చేసి ఫైనల్ గా ఒకటి సంతృప్తికరంగా రావడంతో యూనిట్ అంగీకారానికి వచ్చిందని వినికిడి. ఈ నర్తన్ ఎవరనే ఆసక్తి రేగడం సహజం. 2017లో కన్నడలో శివరాజ్ కుమార్ – శ్రీమురళి కాంబినేషన్ లో మఫ్టీ వచ్చింది. ఇది పెద్ద హిట్టు. తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ ఫలించలేదు.

తమిళంలో శింబు – గౌతమ్ కార్తీక్ హీరోలుగా పత్తు తల టైటిల్ తో షూటింగ్ మొదలుపెట్టాక ఏవో కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ కొనసాగిస్తారో లేదో డౌటే. నర్తన్ కు ప్రశాంత్ నీల్ దగ్గర పని చేసిన అనుభవం అది. కన్నడ డైరెక్టర్లతోనే చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న యష్ ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు

ఇకపై చేయబోయే సినిమాలన్నీ ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ అవుతాయి కాబట్టి కథల ఎంపికలో యష్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో తొందరపడలేదు కానీ మరీ ఆలస్యం చేసినా ఇబ్బందే. మన దిల్ రాజుకు హోంబాలే ఫిలింస్ తో కలిసి ఒక ప్రాజెక్టు ఓకే చేశాడని టాక్ వచ్చింది కానీ దాన్ని డీల్ చేసేది నర్తనా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది. కెజిఎఫ్ 2 హవా తగ్గిపోయి ఓటిటిలో కూడా వచ్చేసింది కాబట్టి ఇక రాబోయే సినిమాల వేగం పెంచడం చాలా అవసరం.   

This post was last modified on May 28, 2022 7:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago