బాలీవుడ్లో గోల్ మాల్, ఢమాల్, హౌస్ ఫుల్ లాంటి కామెడీ సినిమాల ఫ్రాంఛైజీలు చాలానే ఉన్నాయి. కానీ తెలుగులో ఈ ట్రెండ్ ముందు నుంచి లేదు. ఐతే ఎఫ్-2 సినిమా సూపర్ హిట్టవడంతో ఇక్కడా ఇలాంటి ఫ్రాంఛైజీ మొదలైంది. దానికి కొనసాగింపుగా ఎఫ్-3 చేశారు. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు..
దీనికి కొనసాగింపుగా ఎఫ్-4 చేయబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఐతే రాజు మాత్రం.. ఎఫ్-3 ఫలితాన్ని బట్టే ఈ సినిమా ఉంటుందని చెప్పగా, అనిల్ మాత్రం ఆ సినిమా పక్కా అంటే పక్కా అనే అంటున్నాడు. ఎఫ్-3 సక్సెస్ మీద అతడికున్న నమ్మకం కూడా ఇందుకు కారణం కావచ్చేమో. అంతే కాక ఎఫ్-4లో ఇంకో స్టార్ హీరో కూడా యాడ్ కాబోతున్నట్లు ముందే ప్రకటించేశాడు అనిల్.
నిజానికి ఎఫ్-3లోనే ఇంకో స్టార్ హీరో ఉంటాడని, ఆ పాత్రను మాస్ రాజా రవితేజ చేసే ఛాన్స్ అప్పట్లో వార్తలొచ్చాయి. ఐతే ఇది కేవలం ప్రచారం కాదని, నిజంగానే ఎఫ్-3లో ఇంకో స్టార్ హీరోను యాడ్ చేయాలని అనుకున్నామని, కానీ ఆ పాత్ర జోడించకుండానే కావాల్సినంత ఫన్ వచ్చేయడంతో, మరో క్యారెక్టర్ అవసరం లేదని వదిలేశామని అనిల్ తెలిపాడు.
కానీ ఎఫ్-4లో మాత్రం కచ్చితంగా ఇంకో స్టార్ హీరో యాడ్ అవుతాడని అనిల్ స్పష్టం చేశాడు. మరి ఈ పాత్రను రవితేజే చేస్తాడా.. ఇంకెవరినైనా ఆ పాత్రకు అనుకున్నారా అన్నది చూడాలి. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ఎఫ్-2 అప్పట్లో రూ.80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడంతో.. ఎఫ్-3కి బడ్జెట్ రెట్టింపు చేశారు. ఈ చిత్రానికి రూ.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఆ మేర షేర్ వస్తేనే ఎఫ్-4 ముందుకు కదిలే అవకాశముంది.
This post was last modified on May 27, 2022 8:11 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…