బాలీవుడ్లో గోల్ మాల్, ఢమాల్, హౌస్ ఫుల్ లాంటి కామెడీ సినిమాల ఫ్రాంఛైజీలు చాలానే ఉన్నాయి. కానీ తెలుగులో ఈ ట్రెండ్ ముందు నుంచి లేదు. ఐతే ఎఫ్-2 సినిమా సూపర్ హిట్టవడంతో ఇక్కడా ఇలాంటి ఫ్రాంఛైజీ మొదలైంది. దానికి కొనసాగింపుగా ఎఫ్-3 చేశారు. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు..
దీనికి కొనసాగింపుగా ఎఫ్-4 చేయబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఐతే రాజు మాత్రం.. ఎఫ్-3 ఫలితాన్ని బట్టే ఈ సినిమా ఉంటుందని చెప్పగా, అనిల్ మాత్రం ఆ సినిమా పక్కా అంటే పక్కా అనే అంటున్నాడు. ఎఫ్-3 సక్సెస్ మీద అతడికున్న నమ్మకం కూడా ఇందుకు కారణం కావచ్చేమో. అంతే కాక ఎఫ్-4లో ఇంకో స్టార్ హీరో కూడా యాడ్ కాబోతున్నట్లు ముందే ప్రకటించేశాడు అనిల్.
నిజానికి ఎఫ్-3లోనే ఇంకో స్టార్ హీరో ఉంటాడని, ఆ పాత్రను మాస్ రాజా రవితేజ చేసే ఛాన్స్ అప్పట్లో వార్తలొచ్చాయి. ఐతే ఇది కేవలం ప్రచారం కాదని, నిజంగానే ఎఫ్-3లో ఇంకో స్టార్ హీరోను యాడ్ చేయాలని అనుకున్నామని, కానీ ఆ పాత్ర జోడించకుండానే కావాల్సినంత ఫన్ వచ్చేయడంతో, మరో క్యారెక్టర్ అవసరం లేదని వదిలేశామని అనిల్ తెలిపాడు.
కానీ ఎఫ్-4లో మాత్రం కచ్చితంగా ఇంకో స్టార్ హీరో యాడ్ అవుతాడని అనిల్ స్పష్టం చేశాడు. మరి ఈ పాత్రను రవితేజే చేస్తాడా.. ఇంకెవరినైనా ఆ పాత్రకు అనుకున్నారా అన్నది చూడాలి. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ఎఫ్-2 అప్పట్లో రూ.80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడంతో.. ఎఫ్-3కి బడ్జెట్ రెట్టింపు చేశారు. ఈ చిత్రానికి రూ.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఆ మేర షేర్ వస్తేనే ఎఫ్-4 ముందుకు కదిలే అవకాశముంది.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…