టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కు రెడీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చి నాలుగైదు రోజులే అయింది. ఆ తర్వాత ఒకట్రెండు చిన్న టీజర్లు వదిలారు. ఇలా ప్రమోషన్ మొదలుపెట్టి కొన్ని రోజుల పాటు ఏదో ఒక విశేషాన్ని పంచుకుంటూ.. ఆ తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. గట్టిగా ప్రమోట్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తారని అనుకున్నారు.
రిలీజ్ డేట్ ఎప్పుడుంటుంది.. ఏ ఫ్లాట్ ఫాంలో రిలీజవుతుందనే సమాచారం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లకు పెద్ద షాకే ఇచ్చింది. బుధవారం అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసి పడేశారు. అసలు కొన్ని గంటల ముందు కూడా ‘కృష్ణ అండ్ హిస్ లీల’ రిలీజ్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ఉన్నట్లుండి ఇలా సినిమాను రిలీజ్ చేసేయడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
గురువారం ఉదయం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నట్లుగా ట్వీట్లు చూసి జనాలు షాకవుతున్నారు. నిన్న అర్ధరాత్రి సడెన్ అప్డేట్ చూసి వెంటనే కొందరు సినిమా చూసేశారు. రివ్యూలు కూడా కొన్ని బయటికి వచ్చాయి. ఇప్పటిదాకా రిలీజైన్ డైరెక్ట్ ఓటీటీ సినిమాలతో పోలిస్తే దీనికి మెరుగైన టాకే వినిపిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ సరదాగా సాగిపోయిందని.. కాలక్షేపానికి బాగానే పనికొస్తుందని అంటున్నారు.
ఫైనల్ టాక్ ఏంటన్నది ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు.. తొలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రూపొందించిన చిత్రమిది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి అతను రైటర్ కూడా కావడం విశేషం. శ్రద్ధ శ్రీనాథ్తో పాటు షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది.
This post was last modified on June 25, 2020 10:36 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…