టాలీవుడ్లో ఒక వారం గ్యాప్ తర్వాత మళ్లీ ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఆ చిత్రమే.. ఎఫ్-3. మీడియం రేంజి సినిమాగా రిలీజై… చాలా పెద్ద స్థాయి విజయం సాధించిన ఎఫ్-2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఎఫ్-2లో ఉన్న స్టార్ కాస్ట్ అంతా కొనసాగడంతో పాటు దీనికి అదనపు ఆకర్షణలు కూడా తోడయ్యాయి. ఇంకా పెద్ద బడ్జెట్లో సినిమా తీశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తుందనే అంచనా వేస్తున్నారంతా.
ఐతే ఎంత హడావుడి చేస్తున్నా.. ఎఫ్-3కి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మామూలుగా ఈ సినిమా రేంజికి టికెట్లు చాలా వేగంగా అమ్ముడైపోవాలి. షోలు ఈజీగా సోల్డ్ ఔట్ అయిపోవాలి. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ప్రధాన నగరాలన్నింట్లో బుకింగ్స్ చాలా సాధారణంగా ఉన్నాయి. మూడు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. ఎక్కడా సోల్డ్ ఔట్ అన్న మాటే కనిపించడం లేదు.
ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపిస్తున్న షోలు కూడా చాలా చాలా తక్కువ. హైదరాబాద్ సిటీలో ముఖ్యమైన థియేటర్లలో తొలి రోజు బుకింగ్స్ 20-30 శాతం మధ్య కనిపిస్తున్నాయి. ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా.. ఇంత పెద్ద సినిమాకు ఈ బుకింగ్స్ ఆశ్చర్యాన్ని కలిగించేవే. గత రెండు నెలల్లో రిలీజైన పెద్ద సినిమాలకు పెంచినట్లు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనంగా రేట్లు పెంచలేదు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు మీడియా ఇంటర్వ్యూలో నొక్కి నొక్కి చెప్పారు. కానీ సాధారణ స్థాయిలో గరిష్ఠ రేట్లనే పెట్టడంతో ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ అంతటా మల్టీప్లెక్సుల్లో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి రేటు 330 దాకా అవుతోంది. సింగిల్ స్క్రీన్ల రేటు రూ.200 దాటుతోంది. ఈ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్కు రీజనబుల్గా అనిపించట్లేదు. ఇది ఫ్యామిలీ మూవీ కావడంతో యూత్ కూడా టికెట్ల కోసం ఎగబడట్లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రాకుంటే చాలా కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on May 25, 2022 11:53 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…