టాలీవుడ్లో ఒక వారం గ్యాప్ తర్వాత మళ్లీ ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఆ చిత్రమే.. ఎఫ్-3. మీడియం రేంజి సినిమాగా రిలీజై… చాలా పెద్ద స్థాయి విజయం సాధించిన ఎఫ్-2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఎఫ్-2లో ఉన్న స్టార్ కాస్ట్ అంతా కొనసాగడంతో పాటు దీనికి అదనపు ఆకర్షణలు కూడా తోడయ్యాయి. ఇంకా పెద్ద బడ్జెట్లో సినిమా తీశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తుందనే అంచనా వేస్తున్నారంతా.
ఐతే ఎంత హడావుడి చేస్తున్నా.. ఎఫ్-3కి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మామూలుగా ఈ సినిమా రేంజికి టికెట్లు చాలా వేగంగా అమ్ముడైపోవాలి. షోలు ఈజీగా సోల్డ్ ఔట్ అయిపోవాలి. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ప్రధాన నగరాలన్నింట్లో బుకింగ్స్ చాలా సాధారణంగా ఉన్నాయి. మూడు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. ఎక్కడా సోల్డ్ ఔట్ అన్న మాటే కనిపించడం లేదు.
ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపిస్తున్న షోలు కూడా చాలా చాలా తక్కువ. హైదరాబాద్ సిటీలో ముఖ్యమైన థియేటర్లలో తొలి రోజు బుకింగ్స్ 20-30 శాతం మధ్య కనిపిస్తున్నాయి. ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా.. ఇంత పెద్ద సినిమాకు ఈ బుకింగ్స్ ఆశ్చర్యాన్ని కలిగించేవే. గత రెండు నెలల్లో రిలీజైన పెద్ద సినిమాలకు పెంచినట్లు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనంగా రేట్లు పెంచలేదు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు మీడియా ఇంటర్వ్యూలో నొక్కి నొక్కి చెప్పారు. కానీ సాధారణ స్థాయిలో గరిష్ఠ రేట్లనే పెట్టడంతో ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ అంతటా మల్టీప్లెక్సుల్లో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి రేటు 330 దాకా అవుతోంది. సింగిల్ స్క్రీన్ల రేటు రూ.200 దాటుతోంది. ఈ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్కు రీజనబుల్గా అనిపించట్లేదు. ఇది ఫ్యామిలీ మూవీ కావడంతో యూత్ కూడా టికెట్ల కోసం ఎగబడట్లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రాకుంటే చాలా కష్టమే అనిపిస్తోంది.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…