టాలీవుడ్లో ఒక వారం గ్యాప్ తర్వాత మళ్లీ ఓ పెద్ద సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఆ చిత్రమే.. ఎఫ్-3. మీడియం రేంజి సినిమాగా రిలీజై… చాలా పెద్ద స్థాయి విజయం సాధించిన ఎఫ్-2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఎఫ్-2లో ఉన్న స్టార్ కాస్ట్ అంతా కొనసాగడంతో పాటు దీనికి అదనపు ఆకర్షణలు కూడా తోడయ్యాయి. ఇంకా పెద్ద బడ్జెట్లో సినిమా తీశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేస్తుందనే అంచనా వేస్తున్నారంతా.
ఐతే ఎంత హడావుడి చేస్తున్నా.. ఎఫ్-3కి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మామూలుగా ఈ సినిమా రేంజికి టికెట్లు చాలా వేగంగా అమ్ముడైపోవాలి. షోలు ఈజీగా సోల్డ్ ఔట్ అయిపోవాలి. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ప్రధాన నగరాలన్నింట్లో బుకింగ్స్ చాలా సాధారణంగా ఉన్నాయి. మూడు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. ఎక్కడా సోల్డ్ ఔట్ అన్న మాటే కనిపించడం లేదు.
ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపిస్తున్న షోలు కూడా చాలా చాలా తక్కువ. హైదరాబాద్ సిటీలో ముఖ్యమైన థియేటర్లలో తొలి రోజు బుకింగ్స్ 20-30 శాతం మధ్య కనిపిస్తున్నాయి. ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా.. ఇంత పెద్ద సినిమాకు ఈ బుకింగ్స్ ఆశ్చర్యాన్ని కలిగించేవే. గత రెండు నెలల్లో రిలీజైన పెద్ద సినిమాలకు పెంచినట్లు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనంగా రేట్లు పెంచలేదు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు మీడియా ఇంటర్వ్యూలో నొక్కి నొక్కి చెప్పారు. కానీ సాధారణ స్థాయిలో గరిష్ఠ రేట్లనే పెట్టడంతో ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ అంతటా మల్టీప్లెక్సుల్లో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి రేటు 330 దాకా అవుతోంది. సింగిల్ స్క్రీన్ల రేటు రూ.200 దాటుతోంది. ఈ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్కు రీజనబుల్గా అనిపించట్లేదు. ఇది ఫ్యామిలీ మూవీ కావడంతో యూత్ కూడా టికెట్ల కోసం ఎగబడట్లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు చాలా మంచి టాక్ రాకుంటే చాలా కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on May 25, 2022 11:53 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…