‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించి ఎలాంటి పాన్ ఇండియా కాస్టింగ్ ని పెట్టుకోకుండా తెలుగు నటులతోనే సినిమా తీశాడు రాజమౌళి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చే సరికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అజయ్ దేవగన్ ని మరో స్పెషల్ రోల్ కోసం ఎంచుకున్నాడు. ఈ రెండు పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాలో తమ అభిమాన నటులు కూడా ఉన్నారనే భావంతో సినిమా చూశారు. ఈ విషయంలో జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫాలో అవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ తో తన అప్ కమింగ్ పాన్ ఇండియా సినిమాలో రాజమౌళి తరహాలోనే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దీపిక పదుకునేని సంప్రదించారు. ఆమె నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే లిస్టులో జాన్వి కపూర్ , అనన్య పాండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జాన్వి తెలుగు డెబ్యూ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగు , తమిళ్ లో జాన్వి నటిస్తుందని తన తండ్రి బోణీ కపూర్ స్వయంగా చెప్పాడు. దీంతో కొరటాల కన్ను జాన్వి పై పడిందట.
ప్రస్తుతం NTR30 కి సంబంధించి టెక్నిషియన్స్ ని ఫైనల్ చేసుకున్నాడు కొరటాల. మిగతా కాస్టింగ్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ఒక్క హీరోయిన్ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు. ఏదేమైనా కొరటాల మాత్రం బాలీవుడ్ హీరోయిన్ తోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నార్త్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ కోసం వలలు వేస్తున్నాడు. తొందర్లోనే హీరోయిన్ ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ సరసన కనిపించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో వేచి చూడాల్సిందే.
This post was last modified on May 25, 2022 6:42 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…