‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించి ఎలాంటి పాన్ ఇండియా కాస్టింగ్ ని పెట్టుకోకుండా తెలుగు నటులతోనే సినిమా తీశాడు రాజమౌళి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చే సరికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అజయ్ దేవగన్ ని మరో స్పెషల్ రోల్ కోసం ఎంచుకున్నాడు. ఈ రెండు పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాలో తమ అభిమాన నటులు కూడా ఉన్నారనే భావంతో సినిమా చూశారు. ఈ విషయంలో జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫాలో అవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ తో తన అప్ కమింగ్ పాన్ ఇండియా సినిమాలో రాజమౌళి తరహాలోనే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దీపిక పదుకునేని సంప్రదించారు. ఆమె నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే లిస్టులో జాన్వి కపూర్ , అనన్య పాండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జాన్వి తెలుగు డెబ్యూ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగు , తమిళ్ లో జాన్వి నటిస్తుందని తన తండ్రి బోణీ కపూర్ స్వయంగా చెప్పాడు. దీంతో కొరటాల కన్ను జాన్వి పై పడిందట.
ప్రస్తుతం NTR30 కి సంబంధించి టెక్నిషియన్స్ ని ఫైనల్ చేసుకున్నాడు కొరటాల. మిగతా కాస్టింగ్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ఒక్క హీరోయిన్ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు. ఏదేమైనా కొరటాల మాత్రం బాలీవుడ్ హీరోయిన్ తోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నార్త్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ కోసం వలలు వేస్తున్నాడు. తొందర్లోనే హీరోయిన్ ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ సరసన కనిపించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో వేచి చూడాల్సిందే.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…