‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించి ఎలాంటి పాన్ ఇండియా కాస్టింగ్ ని పెట్టుకోకుండా తెలుగు నటులతోనే సినిమా తీశాడు రాజమౌళి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చే సరికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అజయ్ దేవగన్ ని మరో స్పెషల్ రోల్ కోసం ఎంచుకున్నాడు. ఈ రెండు పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాలో తమ అభిమాన నటులు కూడా ఉన్నారనే భావంతో సినిమా చూశారు. ఈ విషయంలో జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫాలో అవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ తో తన అప్ కమింగ్ పాన్ ఇండియా సినిమాలో రాజమౌళి తరహాలోనే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దీపిక పదుకునేని సంప్రదించారు. ఆమె నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే లిస్టులో జాన్వి కపూర్ , అనన్య పాండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జాన్వి తెలుగు డెబ్యూ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగు , తమిళ్ లో జాన్వి నటిస్తుందని తన తండ్రి బోణీ కపూర్ స్వయంగా చెప్పాడు. దీంతో కొరటాల కన్ను జాన్వి పై పడిందట.
ప్రస్తుతం NTR30 కి సంబంధించి టెక్నిషియన్స్ ని ఫైనల్ చేసుకున్నాడు కొరటాల. మిగతా కాస్టింగ్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ఒక్క హీరోయిన్ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు. ఏదేమైనా కొరటాల మాత్రం బాలీవుడ్ హీరోయిన్ తోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నార్త్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ కోసం వలలు వేస్తున్నాడు. తొందర్లోనే హీరోయిన్ ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ సరసన కనిపించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో వేచి చూడాల్సిందే.
This post was last modified on May 25, 2022 6:42 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…