‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించి ఎలాంటి పాన్ ఇండియా కాస్టింగ్ ని పెట్టుకోకుండా తెలుగు నటులతోనే సినిమా తీశాడు రాజమౌళి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చే సరికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అజయ్ దేవగన్ ని మరో స్పెషల్ రోల్ కోసం ఎంచుకున్నాడు. ఈ రెండు పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాలో తమ అభిమాన నటులు కూడా ఉన్నారనే భావంతో సినిమా చూశారు. ఈ విషయంలో జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫాలో అవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ తో తన అప్ కమింగ్ పాన్ ఇండియా సినిమాలో రాజమౌళి తరహాలోనే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దీపిక పదుకునేని సంప్రదించారు. ఆమె నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే లిస్టులో జాన్వి కపూర్ , అనన్య పాండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జాన్వి తెలుగు డెబ్యూ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగు , తమిళ్ లో జాన్వి నటిస్తుందని తన తండ్రి బోణీ కపూర్ స్వయంగా చెప్పాడు. దీంతో కొరటాల కన్ను జాన్వి పై పడిందట.
ప్రస్తుతం NTR30 కి సంబంధించి టెక్నిషియన్స్ ని ఫైనల్ చేసుకున్నాడు కొరటాల. మిగతా కాస్టింగ్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది. కానీ ఒక్క హీరోయిన్ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎవరూ ఫైనల్ అవ్వలేదు. ఏదేమైనా కొరటాల మాత్రం బాలీవుడ్ హీరోయిన్ తోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నార్త్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న బ్యూటీ కోసం వలలు వేస్తున్నాడు. తొందర్లోనే హీరోయిన్ ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ సరసన కనిపించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో వేచి చూడాల్సిందే.
This post was last modified on May 25, 2022 6:42 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…