మన దేశంలో ఫైనల్ రన్ కు వచ్చేసిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఓటిటిలో కొత్త సంచలనాలు నమోదు చేస్తోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన హిందీ వెర్షన్ రెస్పాన్స్ మాములుగా లేదు. పాకిస్థాన్ లో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా మొదటివారంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అది రాజమౌళి మేజిక్ కాక మరేమిటి. ఇండియా స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పాయింట్ ఉందని తెలిసినా కూడా అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. గంగూబాయ్ కటియావాడిని ఈజీగా ఓవర్ టేక్ చేసి మరీ దూసుకుపోతోంది.
అక్కడే కాదు పలుదేశాల్లోనూ నెట్ ఫ్లిక్స్ ఇదే రకమైన స్పందన దక్కించుకుంటోంది. షో పూర్తి చేయడం ఆలస్యం విదేశీయులు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలంటూ తెగ ట్వీట్లు పెడుతున్నారు. యుకె, యుఎస్, లండన్, ఆస్ట్రేలియా తదితర చోట్ల ఆర్ఆర్ఆర్ కు వస్తున్న వ్యూస్ ఓటిటి వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఊహించిందే అయినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాళ్ళ అభిప్రాయం. జీ5లో ఉన్న సౌత్ లాంగ్వజెస్ కన్నా నెట్ ఫ్లిక్స్ లోనే దీని దూకుడు ఎక్కువగా ఉంది.
థియేట్రికల్ గా ఇండియాలో ఆర్ఆర్ఆర్ కథ ముగింపుకొచ్చింది. అరవై రోజులు దాటేయడంతో చాలా చోట్ల తీసేశారు. అందుకే డిజిటల్ లో విరుచుకుపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటనకు దక్కుతున్న గ్లోబల్ అప్రిసియేషన్ వాళ్ళ భవిష్యత్తు సినిమాల మార్కెట్ కు ఖచ్చితంగా ఉపయోగపడేదే. ట్రిపులార్ చూశాక వీళ్లిద్దరితో పాటు జక్కన్న గత సినిమాలు ఏవని తవ్వి తీసే పనిలో పడ్డారు ఫారినర్స్. అందులో బాహుబలి చూడని వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తుంటే ఈ సెన్సేషన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
This post was last modified on May 25, 2022 11:34 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…