మన దేశంలో ఫైనల్ రన్ కు వచ్చేసిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఓటిటిలో కొత్త సంచలనాలు నమోదు చేస్తోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన హిందీ వెర్షన్ రెస్పాన్స్ మాములుగా లేదు. పాకిస్థాన్ లో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా మొదటివారంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అది రాజమౌళి మేజిక్ కాక మరేమిటి. ఇండియా స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పాయింట్ ఉందని తెలిసినా కూడా అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. గంగూబాయ్ కటియావాడిని ఈజీగా ఓవర్ టేక్ చేసి మరీ దూసుకుపోతోంది.
అక్కడే కాదు పలుదేశాల్లోనూ నెట్ ఫ్లిక్స్ ఇదే రకమైన స్పందన దక్కించుకుంటోంది. షో పూర్తి చేయడం ఆలస్యం విదేశీయులు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలంటూ తెగ ట్వీట్లు పెడుతున్నారు. యుకె, యుఎస్, లండన్, ఆస్ట్రేలియా తదితర చోట్ల ఆర్ఆర్ఆర్ కు వస్తున్న వ్యూస్ ఓటిటి వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఊహించిందే అయినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాళ్ళ అభిప్రాయం. జీ5లో ఉన్న సౌత్ లాంగ్వజెస్ కన్నా నెట్ ఫ్లిక్స్ లోనే దీని దూకుడు ఎక్కువగా ఉంది.
థియేట్రికల్ గా ఇండియాలో ఆర్ఆర్ఆర్ కథ ముగింపుకొచ్చింది. అరవై రోజులు దాటేయడంతో చాలా చోట్ల తీసేశారు. అందుకే డిజిటల్ లో విరుచుకుపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటనకు దక్కుతున్న గ్లోబల్ అప్రిసియేషన్ వాళ్ళ భవిష్యత్తు సినిమాల మార్కెట్ కు ఖచ్చితంగా ఉపయోగపడేదే. ట్రిపులార్ చూశాక వీళ్లిద్దరితో పాటు జక్కన్న గత సినిమాలు ఏవని తవ్వి తీసే పనిలో పడ్డారు ఫారినర్స్. అందులో బాహుబలి చూడని వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తుంటే ఈ సెన్సేషన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
This post was last modified on May 25, 2022 11:34 am
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…